KUMARI AUNTY: టీవీ షోల్లో బిజీ.. షోకి లచ్చ.. రానూపోనూ ఎక్స్‌ట్రా

కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 05:54 PM IST

KUMARI AUNTY: నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మీది మొత్తం వెయ్యి అయింది.. అన్న ఒక్క డైలాగ్‌తో కుమారీ ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్లుగా పాపులర్ అయింది. యూట్యూబ్ ఛానల్సే కాదు.. మెయిన్ మీడియా కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడింది. అటు తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌కి కూడా ఫుల్లుగా గిరాకీ పెరిగింది. కుమారీ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానెల్స్ ఆమెను షోస్‌కి గెస్ట్‌గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది.

RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్‌.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారీ ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్‌గా స్టార్ మా ఛానెల్‌లో బీబీ ఉత్సవం స్పెషల్ ఈవెంట్‌లో గెస్ట్‌గా కూడా కుమారీ ఆంటీకి ఆహ్వానం అందింది. ఆ తర్వాత జీ తెలుగులో రోజూ మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్‌లో ఓ గెస్ట్ రోల్‌లో ఛాన్స్ వచ్చింది. అంటే ఇప్పటికే ఈటీవీ, మాటీవీ, జీ టీవీలను కుమారీ ఆంటీ కవర్ చేసేసింది. పికప్ అండ్ డ్రాప్ చేస్తున్నారట. ఆ షోలకు వెళ్లినప్పుడు ఫుడ్ కూడా తెమ్మని చెబుతున్నారట. దాంతో ఫుడ్ బిజినెస్ కూడా వర్కవుట్ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో.. ఇంకా సీరియల్స్, టీవీ షోల్లో కూడా కుమారీ ఆంటీకి ఆఫర్లు ఎన్ని వస్తాయో తెలియదు. సెలబ్రిటీగా మారిపోయి.. బిజీ అవుతున్న కుమారీ ఆంటీ.. తన ఫుడ్ బిజినెస్ మూసేస్తుందా.. ఫుల్ టైమ్ సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తుందా..? అదే మాట ఆమెను అడిగితే.. తన ఫుడ్ బిజినెస్ తర్వాతే ఏదైనా అంటోంది. ఒకప్పుడు టీవీల్లో చూసేవాళ్ళని.. ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకొని వచ్చాను అని చెప్పింది. వీలైనప్పుడు.. సాయంత్రం వేళల్లో.. దుకాణం కట్టేశాకే.. షోలకు వెళ్తున్నట్టు కుమారీ ఆంటీ చెబుతోంది. కానీ కుమారీ ఆంటీ ఈమధ్య ఫుడ్ బిజినెస్ దగ్గర కనిపించడం లేదంటున్నారు కొందరు.

ఆమె భర్త, కొడుకు మాత్రమే ఉంటున్నారట. టీవీ షోలతో బిజీగా మారడంతో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర అప్పుడప్పుడు కనిపించట్లేదని చెబుతున్నారు. టీవీషోలకు వెళ్లొస్తే కుమారీ ఆంటీకి పైసలు బాగానే ముడుతున్నయ్. ఒక్కో షోకి 50 వేల నుంచి లక్ష దాకా రెమ్యునేషన్ ఇస్తున్నారట. ఆమె ప్రత్యేకంగా ఇంత కావాలని డిమాండ్ చేయకపోయినా.. డబ్బులు బాగానే అందుతున్నట్టు సమాచారం. దానితోడు.. వెళ్ళినప్పుడు తన ఫుడ్ కూడా ఆర్డర్ మీద తీసుకెళ్ళి.. నటీనటులు.. సెట్‌లో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తోంది. సో.. రెమ్యునరేషన్ తో పాటు.. ఫుడ్ పైసలు కూడా వస్తున్నయ్ అంటున్నారు. రెండు లివర్లు ఎక్స్ ట్రా… మొత్తం వెయ్యి అని అన్న కుమారీ ఆంటీ.. ఇక ముందు షోకి లక్ష.. రానూ పోనూ ఎక్స్ ట్రా అంటుందేమో చూడాలి.