Rajinikanth: ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్న లెజెండ్స్.. ప్రచారం నిజమేనా..?

నాయకుడు లాంటి ఓ మైల్ స్టోన్ అనిపించే మూవీతీసి కెరీర్‌కి ముగింపు పలికే పనిలో ఉన్నాడట మణిరత్నం. కమల్‌కి విక్రమ్ సీక్వెలే ఆఖరి చిత్రం అయ్యేలా ఉందట. లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో కమల్ చేసే ఆఖరి చిత్రం విక్రమ్-2 అంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 05:59 PM IST

Rajinikanth: మణిరత్నం కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడబోతోందా..? అంత గొప్ప దర్శకుడు.. ఈ ఏజ్‌లో కూడా పొన్నియన్ సెల్వన్, 1, 2అంటూ పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపిన డైరెక్టర్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా? ఈ డౌట్‌ని కమల్ హాసన్ మూవీ నిజం చేసేలా ఉంది. కమల్‌తో మణిరత్నం తీయబోయే సినిమానే ఆఖరి చిత్రమంటున్నారు. నాయకుడు లాంటి ఓ మైల్ స్టోన్ అనిపించే మూవీతీసి కెరీర్‌కి ముగింపు పలికే పనిలో ఉన్నాడట మణిరత్నం.

ఒక వైపు వ్రుధ్దాప్యం, మరో వైపు అనారోగ్యం. అసలే రావన్ టైంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పటి నుంచే తీయాలా వద్దా అన్నట్టు మూవీలు తీస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ అయితే అతి కష్టం మీద పూర్తి చేశాడు. అందుకే కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేమూవీ సాలిడ్‌గా ఉండాలని కమల్‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీలో రజినీకాంత్‌ని తీసుకుంటున్నాడు. ఇక సూర్య, విక్రమ్ కూడా గెస్ట్ రోల్ వేయబోతున్నారట.
దళపతి లాంటి స్టోరీ లైన్‌తోనే కమల్, రజినీని పెట్టి మణిరత్నం భారీగా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది మణిరత్నంకి ఆఖరి మూవీ అయితే, కమల్‌కి విక్రమ్ సీక్వెలే ఆఖరి చిత్రం అయ్యేలా ఉందట. లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో కమల్ చేసే ఆఖరి చిత్రం విక్రమ్-2 అంటున్నారు. అది 2025లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

ఇక రజినీకాంత్ ఆఖరి చిత్రం కూడా తీసే బాధ్యత లోకేష్ మీదే పడినట్టుంది. ఈ ఏడాది చివర్లో రజినీకాంత్‌తో లోకేష్ సినిమా సెట్స్ పైకెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా కోలీవుడ్‌లో లివింగ్ లెజెండ్స్ లాంటి స్టార్స్ అంతా ఒకటీ రెండు ఏళ్లలో కెరీర్‌కి గుడ్ బై చెప్పేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నారు.