Guntur Kaaram: వార్తలు నమ్మకండి.. త్రివిక్రమ్‌కు మహేష్ క్లాస్ ..!

రీసెంట్‌గా రిలీజయిన రెండో పాట 'ఓ మై బేబీ' మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. పాటకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సాంగ్ విషయంలో మూవీ టీమ్‌కి మహేష్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 02:16 PM IST

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గుంటూరు కారం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే, తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘ధమ్ మసాలా’ ఆకట్టుకుంది. అయితే రీసెంట్‌గా రిలీజయిన రెండో పాట ‘ఓ మై బేబీ’ మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సాంగ్ ట్యూన్ లిరిక్స్ పట్ల మహేష్‌తో పాటు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

Salar : సలార్ సరికొత్త రికార్డు..

పాటకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకొని, నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సాంగ్ విషయంలో మూవీ టీమ్‌కి మహేష్ క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో షూట్ చేయబోయే మాస్ సాంగ్‌పై రీవర్క్ చేయాలని మహేష్ సూచించినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ గుంటూరు కారం సినిమాలో నాలుగు ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ ఉన్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట.

భారీ బడ్జెట్‌తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుండగా.. అందుకు తగ్గట్టే సినిమాను స్పీడ్ స్పీడ్ షూట్ చేస్తున్నాడట త్రివిక్రమ్. డసెంబర్ లో గుమ్మడికాయ కొట్టేసుకుంటే ఓ రెండు వారాలు పబ్లిసిటీకి సరిపోతాయనే ప్లాన్ లో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.