Guntur Karam: ఒక్క సినిమా.. ఎందరు హీరోయిన్లు.. త్రివిక్రమ్ మీద మళ్లీ బాబు ఫైర్..

మొదట కథ మార్పించాడు. నిన్న హీరోయిన్‌ పూజా హెగ్డేని మార్చాల్సిందే అన్నాడు. ఇప్పుడు తమన్‌ని కూడా పక్కకు తీసుకెళ్లమంటున్నాడు. ఇలా రోజుకో ట్విస్ట్‌తో మాటల మాంత్రికుడిని పనిష్ చేస్తున్న మహేశ్.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్‌ని చింతకర్ర విరిగేలా పనిష్ చేస్తున్నట్టున్నాడు.

  • Written By:
  • Publish Date - June 24, 2023 / 05:52 PM IST

Guntur Karam: సూపర్ స్టార్ మహేశ్ బాబు టీచర్‌గా మారి, బెత్తం పట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని రోజుకో రకంగా పనిష్ చేస్తున్నాడా..? మొదట కథ మార్పించాడు. నిన్న హీరోయిన్‌ పూజా హెగ్డేని మార్చాల్సిందే అన్నాడు. ఇప్పుడు తమన్‌ని కూడా పక్కకు తీసుకెళ్లమంటున్నాడు.

ఇలా రోజుకో ట్విస్ట్‌తో మాటల మాంత్రికుడిని పనిష్ చేస్తున్న మహేశ్.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్‌ని చింతకర్ర విరిగేలా పనిష్ చేస్తున్నట్టున్నాడు. రీసెంట్‌గా జరిగిన సంఘటన ప్రకారం చూస్తే త్రివిక్రమ్ తీసుకున్న పూజాహెగ్డేని మహేశ్ పక్కకు తప్పించిన వెంటనే సీన్‌లోకి సంయుక్తా మీనన్ పేరు ప్రస్తావనకు తెచ్చాడట మాటల మాంత్రికుడు. అసలే ఈ దర్శకుడికి, ఆ హీరోయిన్‌కి మధ్య ఏదో జరుగుతుందనే పుకార్లు పెరిగాయి. అందుకే మండిపోయిన మహేశ్ బాబు వెంటనే సంయుక్త మీనన్ కాదు, సాక్షి వైద్య లేదంటే మీనాక్షి చౌదరి పేర్లను ప్రస్తావించాడట. ప్రజెంట్ తమన్‌ని కూడా మహేశ్ క్షమించేలా లేడని తెలుస్తోంది.

మొత్తానికి కథ విషయంలో ఫ్లాపైన త్రివిక్రమ్, కథని మార్చటంతో మొదలు.. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందర్ని మారుస్తూ పోవాల్సి వస్తోంది. ఈ నిర్ణయాల్లో ఏమాత్రం తేడా వచ్చిన సూపర్ స్టార్ ఈ సినిమానే ఆపేస్తా అన్నాడట. ఈ బుధవారం చిన్నపాటి వార్నింగ్‌నే ఇచ్చాడట మహేశ్. ఇవి ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వినిపిస్తున్న గుసగుసలే.