MAHESH BABU-ALIA BHATT: కొత్త డౌట్స్.. మహేష్‌కు జోడిగా అలియా..!

తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పోచర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను వీక్షించి దానిపై సోషల్‌ మీడియాలో స్పందించారు.

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 04:23 PM IST

MAHESH BABU-ALIA BHATT: ఓటీటీ ఎంత పవర్‌ఫుల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి దృష్టీ ఓటీటీపైనే ఉంది. థియేటర్స్‌లో సినిమాలు రిలీజ్‌ అవుతున్నప్పటికీ ఓటీటీల ప్రాధాన్యం మరింత పెరిగిపోతోంది. ఇప్పుడు స్టార్స్‌ కూడా ఓటీటీలను ఫాలో అవుతున్నారు. అందులో రిలీజ్‌ అవుతున్న సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పోచర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

LIQUOR CASE TICKETS: ఏంటీ రాజకీయాలు..? లిక్కర్ కేసులో ఉన్నోళ్ళకే టిక్కెట్లు.. పోటీలు పడుతున్న వైసీపీ,టీడీపీ

‘దిల్లీ క్రైమ్‌’ ఫేమ్‌ డైరెక్టర్‌ రిచీ మెహతా ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. మలయాళంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను వీక్షించి దానిపై సోషల్‌ మీడియాలో స్పందించారు. ఆయన పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ ఏమిటంటే.. ‘ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు.. వారి చేతులు వణకలేదా.. పోచర్‌ అనే క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది’ అంటూ స్పందించారు. ఈ వెబ్‌ సిరీస్‌పై మహేష్‌ స్పందించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అడవుల్ని, అడవి జంతువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మహేష్‌ చెప్పడం అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఈ కామెంట్‌ చేసిన మహేష్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. మరో వైపు కొత్త డౌట్ తెరపైకి వచ్చింది.

మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో అలియా భట్ హీరోయిన్ అని ఫిక్స్ అవుతున్నారు. అందుకే అలియా తీసిన వెబ్ సిరీస్‌పై సూపర్ స్టార్ స్పందించాడని కథలు అల్లేస్తున్నారు. అయితే ఇప్పటికి వరకు మహేష్ జోడిగా జక్కన్న ఏ హీరోయిన్‌ను తీసుకుంటాడు అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తెరపైకి చాలా పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకునేతోపాటు విదేశీ ముద్దుగుమ్మల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు. ఇప్పుడు అలియా వెబ్ సిరీస్‌కు మహేష్ రియాక్ట్ అవ్వడంతో అందరూ అలియానే అయి ఉండొచ్చని ఫిక్స్ అవుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.