MAHESH BABU: రాజమౌళి సినిమా తర్వాత ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మహేశ్ ప్లానింగ్

రాజమౌళి పర్ఫెక్షనిస్ట్ .. క్వాలిటీ ఔట్ పుట్ కోసం ఏడాదిఏంటి రెండేళ్లైనా సినిమాను చెక్కుతూనే ఉంటాడు. తనతో మూవీచేస్తే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇమేజ్ తోపాటు మార్కెట్ క్రియేట్ అవుంది. కానీ రెండు మూడేళ్లు కాలం కూడా కరిగిపోతుంది.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 03:21 PM IST

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందే సర్ధుకుంటున్నాడు. రాజమౌళితో సినిమా తీస్తే వచ్చే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.వాటినే ముందుగా సెట్ రైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలే రాజమౌళి పర్ఫెక్షనిస్ట్ .. క్వాలిటీ ఔట్ పుట్ కోసం ఏడాదిఏంటి రెండేళ్లైనా సినిమాను చెక్కుతూనే ఉంటాడు. తనతో మూవీచేస్తే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇమేజ్ తోపాటు మార్కెట్ క్రియేట్ అవుంది.

RED SANDAL: కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు

కానీ రెండు మూడేళ్లు కాలం కూడా కరిగిపోతుంది. ఇంతా చేస్తే రాజమౌళి మేకింగ్ లో హీరోకి హిట్ పడ్డాక, తర్వాత వచ్చేవి ఫ్లాపులే అంటారు. తారక్ కి మూడు సార్లు అలానే జరిగింది. చరణ్ కి త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్యతో ఆ సెంటిమెంట్ నిజమైంది. ఐతే తారక్ నాలుగో సారి అలా కాకుండా ఉండేందుకు, దేవర విషయంలో జాగ్రత్తలు పెంచాడు. ఇలానే మహేశ్ కూడా రాజమౌళి మూవీ తర్వాత హిట్ పడాలంటే, గట్టి ప్లానింగ్ కావాలనుకుంటున్నాడు. అందుకే సుకుమార్, సందీప్ రెడ్డి వంగకి ఛాన్స్ ఇచ్చాడట.

నిజానికి యానిమల్ మూవీ మహేశ్ చేయాలి.. తను నో చెబితేనే రణ్ బీర్ చేశాడు. పుష్ప కూడా మహేశ్ బాబు నో చెబితేనే బన్నీ తో సుకుమార్ తీశాడంటారు.. అందుకే రాజమౌళి సినిమా తర్వాత సుకుమార్, సందీప్ రెడ్డి వంగతోనే ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడట మహేశ్ బాబు.