Mahesh Babu: మహేశ్ బాబు బాక్సాఫీస్ నవాబు.. హిట్టు పడ్డట్టే.?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూడో సారి త్రివిక్రమ్ తీసిన సినిమా సంక్రాంతికి రాబోతోంది. ఈలోపు మహేశ్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ఫిల్మ్ టీం గ్లింప్స్ ని వదిలింది. అంతే ఒక్కసారిగా యూ ట్యూబ్ ఊగిపోతోంది. సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తోంది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మాసీగా లేకపోవటంతో, ఆకలి మీదున్న మహేశ్ ఫ్యాన్స్ కి ఈ గ్లింప్స్ తో..బిర్యానీ విత్ గుంటూరు స్పెషల్ కారం దొరికినట్టైంది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 03:50 PM IST

అసలు త్రివిక్రమ్ కెరీర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అడుగులన్నీ మహేశ్ బాబుతోనే పడ్డాయి. నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది అతడు మూవీనే. తర్వాత జల్సా మూవీ చేసి మరో హిట్ పట్టేశాడు త్రివిక్రమ్. ఆ వెంటనే ఖలేజాతో మళ్లీ మాస్ మతిపోగొట్టే రైటర్ కమ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.ఇలా మహేశ్ తో అడుగు ముందుకేసిన ప్రతీసారి త్రివిక్రమ్ స్థాయి పెరిగింది. అందుకే అ.. ఆ మూవీలో త్రివిక్రమ్ రాసిన విలన్ డైలాగ్ గుర్తు చేయాల్సి వస్తోంది.. అందులో అన్నట్టు ఏమాత్రం క్రుతగ్నత ఉన్న దేవుడి గదిలో తన ఫోటోలు పెట్టుకోవాలి.

ఇక త్రివిక్రమ్ వదిలిన మహేశ్ బాబు మూవీ గ్లింప్స్ విజువల్స్ పరంగా దుమ్ముదులుపుతుంటే, ఆడియో పరంగా తమన్ ఇరగదీశాడు.. ఈ గ్లింప్స్ తో తమన్ ఈ మూవీ నుంచి ఔట్ అనే రూమర్ కి బ్రేక్ పడింది. అసలు లెక్కే మారింది. మొత్తానికి ఈ సినిమా రావటానికి ఇంకా 7 నెల్ల టైం ఉన్నా, గ్లింప్స్ ఇచ్చిన కిక్ తో హైప్ ఊపేసేలా ఉంది. అన్ని నెలలు ఫ్యాన్స్ తో సహా సినీ లవర్స్ వేయిట్ చేసేలా లేరు..