మీనాక్షి పాప డిమాండ్ దెబ్బకు టాలీవుడ్ హడల్

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ల హవా గట్టిగానే నడుస్తోంది. కొందరు హీరోయిన్లు కనుమరుగు కావడంతో ఇప్పుడు మరికొందరు హీరోయిన్ల హవా మొదలవుతోంది. పూజా హెగ్డే, రష్మిక మందన హవా కాస్త తగ్గింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇక్కడ పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 5, 2024 / 02:50 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ల హవా గట్టిగానే నడుస్తోంది. కొందరు హీరోయిన్లు కనుమరుగు కావడంతో ఇప్పుడు మరికొందరు హీరోయిన్ల హవా మొదలవుతోంది. పూజా హెగ్డే, రష్మిక మందన హవా కాస్త తగ్గింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇక్కడ పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా కనపడుతోంది. దీని కోసం ఆమె తెలుగు కూడా నేర్చుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. అటు బాలీవుడ్ లో సైతం ఆమె డిమాండ్ పెరుగుతోంది.

ఇప్పుడు మన సౌత్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు… మీనాక్షి చౌదరి. ఈమెకు టాలీవుడ్ తో పాటుగా తమిళంలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. స్కిన్ షో విషయంలో పాప ఎక్కడా వెనకడుగు వేయకపోవడం, నటన విషయంలో కూడా పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో ఇప్పుడు టాలీవుడ్ జనాలు ఈమె వెంట పడుతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం ఇక భారీగా రేటు పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ఆమె గట్టిగానే డిమాండ్ చేస్తోంది.

ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్ సినిమాలో ఒక రోల్ కోసం ఆమెను అడిగారట. అలాగే సినిమాలో ఒక కీలక పాటలో ఆమె ఉంటుంది. దీని కోసం మీనాక్షి ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. ఆమె రోల్ మొత్తం విదేశాల్లో ఉంటుంది. కేవలం 20 నిమిషాలు మాత్రమే ఆమె సినిమాలో ఉంటుంది. దీనితో సైలెంట్ అయ్యారట దర్శకుడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్దాంతాన్ని ఫాలో అవుతున్న ఆమె… ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు తగ్గేది లేదు అంటుంది. అటు తమిళంలో జయం రవి సినిమా కోసం కూడా ఈమె భారీగానే డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసారు నిర్మాతలు. కెరీర్ ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి కాస్త చూసి చూడనట్టు పోతే మంచిది అంటున్నారు జనాలు.