Mega Family: నిహారిక చైతన్య మధ్య గ్యాప్‌!? కారణం ఇదేనా..

టాలీవుడ్‌లో ఉన్న స్వీట్‌ కపుల్‌ లిస్ట్‌లో మెగా డాటర్‌ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటారు. 2020లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. చైతన్య ఎంత కామ్‌గా ఉంటాడో.. నిహారిక అంత అల్లరి పిల్ల. అందుకే ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 07:15 PM IST

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తమ ఫొటోలను రెగ్యులర్‌గా అభిమానులతో పంచుకునేది. సడెన్‌గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఇద్దరూ సైలెంట్‌ అయిపోయారు. బయట పెద్దగా కనిపించడంలేదు. పార్టీలు ఫంక్షన్‌లకు వెళ్లడంలేదు. వీటన్నికి తోడు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇక చైతన్య అయితే ఏకంగా పెళ్లి ఫొటోలను కూడా డెలిట్‌ చేశాడు. కేవలం తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటోను మాత్రమే ఉంచుకున్నాడు. దీంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే గతంలో కూడా ఇలాంటి రూమర్స్‌ వచ్చాయి. కొన్ని పార్టీలకు నిహారిక ఒక్కరే వెళ్లడంతో వీళ్ల మధ్య గ్యాప్‌ వచ్చిందని చాలా మంది చర్చించుకున్నారు. విడిపోతున్నారంటూ చర్చ కూడా జరిగింది. కానీ నిహారిక, చైతన్య కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టాడు చైతన్య. దీంతో ఆ ఇష్యూ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ వీళ్ల గురించి సేమ్‌ రూమర్స్‌ వస్తున్నాయి. అయితే ఇప్పుడు చైతన్యే ఫొటోలు డెలిట్‌ చేయడం.. అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈసారి నిజంగానే ఇష్యూ సీరియస్‌ అయ్యేలా ఉందంటూ టాక్‌ నడుస్తోంది. ఈ ఇష్యూపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.