MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్‌ను కలిసిన మెహర్ రమేష్.. మరో సినిమా చేస్తున్నారా..?

దర్శకుడు మెహర్ రమేష్.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో, ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. అక్కడికి వెళ్లిన దర్శకుడు మెహర్ రమేష్.. మెగాస్టార్‌ను కలిశారు.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 08:14 PM IST

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌‌ను భయపెట్టిన చిత్రం భోళాశంకర్. గత ఏడాది ఆగష్టులో వచ్చిన ఈ చిత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. చిరంజీవి సినిమాల్లోనే పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. మెగాస్టార్ రేంజ్‌కు తగ్గ ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది. వీకెండ్‌ తర్వాత నుంచి కలెక్షన్లు భారీగా తగ్గాయి. అసలు.. చిరంజీవి నుంచి ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఎలాంటి అంశాలు ఇందులో లేవు.

Ruhani Sharma: రుహాణి శర్మ గ్లామరస్ ఫొటోస్..

తమిళ రీమేక్ కావడం, మెహర్ రమేష్ దర్శకుడు కావడంతో ముందునుంచే ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. అనుకున్నట్లే ఈ సినిమా ప్రేక్షకులకు షాకిచ్చింది. అందుకే ఈ సినిమాను మెగా ఫ్యాన్స్ అస్సలు గుర్తుంచుకోరు. ఇదంతా.. ఇప్పుడెందుకూ అంటే.. ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో, ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. అక్కడికి వెళ్లిన దర్శకుడు మెహర్ రమేష్.. మెగాస్టార్‌ను కలిశారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఫొటోను కూడా మెహర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మెగాఫ్యాన్స్ మరోసారి ఆందోళనకు గురయ్యారు.

కొంపదీసి మెగాస్టార్‌తో మెహర్ మళ్లీ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని సందేహిస్తున్నారు. మెగాస్టార్.. మళ్లీ మెహర్‌తో సినిమా చేయకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. మెహర్.. చిరును కలిసింది సినిమా చర్చల కోసం కాదు. ఎల్బీ స్టేడియంలో మే 4న జరగనున్న ‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే’ ఈవెంట్‌కు ఆహ్వానించడానికి కలిసినట్లు మెహర్ వెల్లడించారు. దీంతో మెగా ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు.