MEGASTAR CHIRANJEEVI: చిరుతో సందీప్ రెడ్డి వంగ మూవీ.. కానీ, సినిమా వచ్చేది అప్పుడే..

రెబల్ స్టార్ ప్రభాస్ఖతో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ, యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తాడన్నారు. కాని ఈలోపే మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు సందీప్ రెడ్డి వంగ.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 07:30 PM IST

MEGASTAR CHIRANJEEVI: సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ మూవీ ప్లానింగ్‌లో ఉండాలి. ప్రభాస్‌తో తను తీయబోయే సినిమా కోసం వర్క్ చేయాలి. కాని అందుకు విరుద్దంగా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పనుల్లో బిజీ అయ్యాడు. కథ సిద్దం చేస్తున్నాడు. సరే.. కథ వరకు సిద్దం చేశాక తర్వాత అయినా స్పిరిట్ మూవీ పనులు మొదలు పెడతాడా అంటే, అక్కడ ట్విస్టే ఎదురైంది. రెబల్ స్టార్ ప్రభాస్ఖతో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ, యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తాడన్నారు.

PAWAN KALYAN: హంగ్రీ చీతాగా మారిన ఓజీ.. కారణం అదేనా?

కాని ఈలోపే మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు సందీప్ రెడ్డి వంగ. చిరుకి కథ చెప్పడం కూడా జరిగిపోయిందట. ఎంతైనా తన అభిమాన నటుడు మెగాస్టార్‌కి సందీప్ కథ చెప్పడం అంటే, ఇక అది ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ అనుకోవాల్సిందే. సరే.. చిరుతో సందీప్ మూవీ ఓకే అయినా పట్టాలెక్కడం మాత్రం ఇప్పట్లో కాదు. ఎందుకంటే స్పిరిట్ పూర్తి చేసి, యానిమల్ పార్క్ తీసి, తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ జరిగేసరికే 3 ఏళ్ల టైం పడుతుంది.

అలాంటప్పుడు చిరుతో సినిమా ఎప్పుడంటే 2028లోనే అనుకోవాల్సి వస్తోంది. ఇక సల్మాన్ ఖాన్‌కి కూడా సందీప్ కథలు చెప్పాడట. అంటే కనీసం కెరీర్‌లో ఐదేళ్లు ముందుగానే ఫ్యూచర్‌ని ప్లాన్ చేస్తున్నాడు సందీప్ అనంటున్నారు.