దర్శన్‌ కేసులో సంచలనం.. వీడు మనిషేనా ?

కన్నడ హీరో దర్శన్ వ్యవహారం.. కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. నటి పవిత్ర గౌడతో దర్శన్ వ్యవహారంపై...

  • Written By:
  • Updated On - September 5, 2024 / 08:46 PM IST

కన్నడ హీరో దర్శన్ వ్యవహారం.. కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. నటి పవిత్ర గౌడతో దర్శన్ వ్యవహారంపై… అభిమాని రేణుకాస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనే కోపంతో… చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మొత్తం 10మందికి పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామిని హింసించి హింసించి చంపారు. ఈ దారుణానికి సంబంధించి ఇప్పుడో ఫొటో వెలుగులోకి వచ్చింది. అది చూసిన ఎవరికైనా.. దర్శన్ అసలు మనిషేనా అనే అనుమానం రాకుండా ఉండదు. దాడి సమయంలో రేణుకాస్వామి ఎలా చిత్ర హింసలు అనుభవించాడో ఆ ఫొటోలో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయ్‌. పార్క్ చేసిన ట్రక్కు ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు రేణుకాస్వామి. మరో చిత్రంలో అతడి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ట్రక్కు ముందు అపస్మారక స్థితిలో కనిపిస్తున్నాడు. దర్శన్ సహాయకుడు పవన్ ఫోన్‌లో ఈ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ లీకైన ఫోటోలపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దర్శన్, అతడి గ్యాంగ్ చేసిన దారుణమైన దాడిలో రేణుకాస్వామి మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో స్వామి తీవ్రగాయాల వల్ల చనిపోయినట్లు తేలింది. ఎముకలు విరిగిపోయాయి. అతని శరీరంపై మొత్తం 39 గాయాల గుర్తులు ఉన్నాయ్‌. బాధితురాలి తలపై లోతైన కోత కూడా ఉంది. ఈ దారుణమైన దాడితో రేణుకాస్వామి పదేపదే స్పృ‌హ తప్పిపోయినప్పుడు, అతడికి కరెంట్ షాక్ పెట్టి మేల్కొనేలా చేశారు. హత్య చేసిన తర్వాత డబ్బు, తన పరపతిని ఉపయోగించి, స్వామి మృతదేహాన్ని మాయం చేయడానికి, సాక్ష్యాలు నాశనం చేయడానికి యత్నించినట్లు ఛార్జిషీట్‌లో ఉంది. ఈ కేసులో మొత్తం 17 మంది అరెస్టయ్యారు.