Samantha: సమంత నువ్ చల్లగా ఉండాలి.. వైరల్ అవుతోన్న చైతూ మాటలు..

విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య అంత బాధపడ్డారో, పడుతున్నారో తెలియదు కానీ.. ఆ జంట బ్రేకప్‌ చూసి అభిమానులు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. క్యూట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకొని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. సడెన్‌గా బ్రేకప్‌ చెప్పారు. ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌ స్ర్కీన్‌ ఈ జంటకు కోట్లలో ఉన్నారు ఫ్యాన్స్.

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 09:45 PM IST

అలాంటి జంట విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వారిద్దరూ మళ్లీ కలిసిపోతే ఎంత బావుండు అనుకుంటారు ఇప్పటికీ ఫ్యాన్స్ అంతా ! విడాకులకు కారణం ఏంటో ఇప్పటికీ ఇద్దరి ఏ ఒక్కరు చెప్పలేదు. డివోర్స్ తర్వాత.. ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే శాకుంతలంతో సమంత పలకరించగా.. కొద్దిరోజుల్లో కస్టడీతో ముందుకు రాబోతున్నాడు చైతూ. మే12న ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది. కస్టడీ ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయ్.

పర్సనల్ లైఫ్‌ గురించి చైతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సమంతతో విడాకుల వ్యవహారంపై మొదటిసారి పెదవి విప్పాడు. తాను, సమంత విడిపోయి రెండేళ్లు అవుతోందని.. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నామని చెప్పాడు. సమంత మంచి మనిషి అని.. ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానంటూ చైతూ మాట్లాడిన మాటలు.. ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేస్తున్నాయ్. తమ మధ్య మంచి ర్యాపోనే కంటిన్యూ అవుతోందని.. సోషల్‌ మీడియాలో మాత్రమే ఏదో జరిగిపోతుందనే ప్రచారం చేస్తున్నారని చైతూ తన మార్క్ సెటైర్లు వేశాడు.

తనతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తిని.. మా ఇద్దరి మధ్యలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా గురించి చైతూ వ్యాఖ్యలు ఎలాఉన్నా.. తమకు నచ్చిన జంట.. ఇంకా ఇష్టంగానే ఉన్నారని.. ఎవరి జీవితాల్లో వారు నచ్చినట్లు ఉంటున్నారన్న ఊహే అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.