NAGA CHAITANYA: క్రేజీ సాహసం.. సముద్రం మధ్య నుంచి చైతన్య వస్తాడా

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబందించిన తాజా అప్‌డేట్ అక్కినేని ఫాన్స్‌లో ఫుల్ జోష్ తెచ్చింది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 04:00 PM IST

NAGA CHAITANYA: అక్కినేని నాగ చైతన్య మాస్ విశ్వరూపాన్ని పాన్ ఇండియా లెవల్లో చాటి చెప్పబోతున్న చిత్రం తండేల్. ఇటీవలే ప్రారంభం అయిన ఈ మూవీ మీద అక్కినేని అభిమానులతో పాటు సినీ పేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబందించిన తాజా అప్‌డేట్ అక్కినేని ఫాన్స్‌లో ఫుల్ జోష్ తెచ్చింది.

Jr NTR: ఫ్యామిలీ టైం.. హఠాత్తుగా జపాన్‌కు ఎన్టీఆర్

తండేల్ షూటింగ్ లేటెస్ట్‌గా సముద్రం మధ్యలో జరగబోతుంది. ఈ మేరకు షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తున్నట్టుగా చైతుపై ఓ ఎనర్జిటిక్ స్టిల్‌తో కూడిన పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేసారు. చేపల వేటకి చై బయలుదేరినట్టుగా ఉన్న ఆ పోస్టర్ చూస్తుంటేనే చైతు కంప్లీట్ మాస్ లుక్‌లో కనపడబోతున్నాడనే విషయం అర్ధం అవుతుంది. అక్కినేని అభిమానులు అయితే పోస్టర్‌ని చూసి పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి సినిమానే కాదా చై నుంచి మేము కోరుకునేది అని సంబరాల్లో మునిగిపోయారు. తండేల్ మూవీలో చైతు మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్నాడు.

చైతన్య సరసన క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలని అందించబోతున్నాడు. తన కెమెర తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి ఒక రూపాన్ని తీసుకొచ్చిన శ్యాం దత్ ఫొటోగ్రఫీని అందిస్తున్నాడు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీతో అక్కినేని కుర్రాడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.