Sprit rashmika : స్పిరిట్’ లో నేషనల్ క్రష్

గత ఏడాది 'సలార్ (Salaar) సీజ్‌ఫైర్'తో క్రేజీ హిట్‌ను అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)', 'సలార్ 2(Salaar 2)', 'రాజా సాబ్' (Raja Saab) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు.

గత ఏడాది ‘సలార్ (Salaar) సీజ్‌ఫైర్’తో క్రేజీ హిట్‌ను అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas).. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD)’, ‘సలార్ 2(Salaar 2)’, ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ.. ఈ కాంబో ఇప్పటికే బారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ మూవీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ లీక్ అయ్యింది.. ఈ మూవీలో నేషనల్‌ క్రష్‌ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందని తెలిసింది..

ఇప్పటికే భారీ బజ్ ఏర్పడిన ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఎన్నో వార్తలు వినిపించాయి.. అయితే.. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందని ఓ టాక్ వినిపిస్తోంది.. రష్మిక మందన్నాకు ఇప్పటికే ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా వినిపించాడట. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రభాస్‌తో ఆమెకిది మొదటి చిత్రం కాగా.. సందీప్ రెడ్డి వంగాతో ‘యానిమల్’ చేసింది. ఇది సెన్సేషనల్ హిట్ అయింది. అదే సెంటిమెంట్ ప్రకారం దర్శకుడు ఆమెను తీసుకున్నాడని అంటున్నారు.. దీంతో.. ఈ ప్రెస్టేజియస్ మూవీలో భాగమైనందుకు రష్మిక ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.. ఈ న్యూస్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు..

‘స్పిరిట్’ మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ఒక హానెస్ట్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సందీప్ వంగా కన్‌ఫామ్ చేశాడు.. హై రేంజ్‌ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘స్పిరిట్’ మూవీలో బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor) విలన్‌గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు. ఇది ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది.