Trisha Krishnan: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు..

త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, అదే సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు కమిషన్‌ను ఎంతో బాధించాయని తెలుపుతూ.. అతడిపై తక్షణం కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - November 21, 2023 / 02:32 PM IST

Trisha Krishnan: నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మన్సూర్ అలీఖాన్‌పై నడిగర్ సంఘం కన్నెర్ర చేస్తే.. జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీంతో.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందా అనే చర్చ కోలివుడ్‌లో జరుగుతోంది. హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల మంటలు ఇంకా చల్లారలేదు. ఆ వివాదం కంటిన్యూ అవుతుండగానే.. జాతీయ మహిళా కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ అంశాన్ని సుమోటాగా స్వీకరించింది.

Bigg Boss 7 : రతిక , ప్రశాంత్ మధ్య డైలాగ్ వార్.. అన్నా పంచె జాగ్రత్త

త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన కమిషన్, అదే సమయంలో విచారం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు కమిషన్‌ను ఎంతో బాధించాయని తెలుపుతూ.. అతడిపై తక్షణం కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. లైంగిక ఆరోపణలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 509-బి కింద మన్సూర్‌పై కేసు నమోదు చేయబోతున్నారు పోలీసులు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్త సహించేది లేదని స్పష్టం చేసింది మహిళా కమిషన్. ఎక్కడ వ్యాఖ్యలు చేసినా తమ దృష్టికొస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు.. నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌పై సౌత్ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (SIAA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిషకు క్షమాపణలు చెప్పేవరకు మన్సూర్‌పై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నేతలు. మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన సెక్సీయస్ట్‌ కామెంట్లను ఖండించారు. మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషకు బహిరంగంగా క్షమాపణ చెప్సాల్సిందేనని డిమాండ్‌ చేశారు SIAA అధ్యక్షుడు నాజర్‌.

ALLU ARJUN: ఏపీ సీఎం జగన్‌కు స్టైలిష్ స్టార్‌ ఝలక్‌..!

నడిగర్‌ సంఘం నటుల మద్దతు త్రిషకు ఉంటుందన్నారాయన. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమాలో విజయ్‌, త్రిష, మన్సూర్‌ అలీ ఖాన్ నటించారు. మూవీ హిట్‌ కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు మన్సూర్‌. ఆ ఇంటర్వ్యూలో త్రిషపై మన్సూర్‌ అలీ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో రేప్‌ సీన్‌ ఉంటుందని భావించానని.. కానీ.. త్రిషను అత్యాచారం చేసే సీన్ దక్కలేదంటూ కామెంట్ చేశాడు మన్సూర్. ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. మన్సూర్‌కు మానవత్వం లేదంటూ తిట్టిపోసింది. అంతేకాకుండా.. ఇకపై మన్సూర్‌తో కలిసి నటించేంది లేదని త్రిష తెగేసి చెప్పింది. అయితే.. త్రిష, లోకేష్‌ కనగరాజ్‌ సీరియస్‌ అయ్యేసరికి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు మన్సూర్‌ అలీ ఖాన్.

త్రిషను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చానని.. అయితే స్టేట్‌మెంట్ తీసేసి, ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారని వాపోయాడు. మన్సూర్‌పై ఇప్పటికే లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలతో మరో కేసు అతడి మెడకు చుట్టుకోబోతోంది.