దేవరకు గాయం, రామ్ చరణ్ కు భయం, ఏం చేస్తున్నాడు…?

సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న సంస్కృతి అత్యంత దారుణం. ఎవడు ఎన్ని మాట్లాడినా ఒక సినిమాపై మరో సినిమా ఫ్యాన్స్ అత్యంత దారుణంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని పెంచడం ఏ మాత్రం సమర్ధించేది కాదు.

  • Written By:
  • Updated On - October 3, 2024 / 06:17 PM IST

సినిమాల్లో ఇప్పుడు కొనసాగుతున్న సంస్కృతి అత్యంత దారుణం. ఎవడు ఎన్ని మాట్లాడినా ఒక సినిమాపై మరో సినిమా ఫ్యాన్స్ అత్యంత దారుణంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం సినిమాపై నెగటివ్ ప్రచారాన్ని పెంచడం ఏ మాత్రం సమర్ధించేది కాదు. సినిమాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. దేవర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ వెనుకా ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేసారు. సినిమా అస్సలు బాగాలేదు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఎన్టీఆర్ సినిమాను మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా అన్ని వైపుల నుంచి టార్గెట్ చేసారు. సినిమాపై నెగటివ్ పెంచి ఆ ప్రభావం వసూళ్ళపై పడే విధంగా ప్రభావితం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. మెగా ఫ్యామిలీ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పీకల వరకు కోపం మీద ఉన్నారు. డిసెంబర్ లో గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తారో అనే భయం మెగా హీరో రామ్ చరణ్ లో ఓ రేంజ్ లో ఉంది. అటు అల్లు ఆర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేయవచ్చు.

దీనితో రామ్ చరణ్ ఏం చేయాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను అంతగా టార్గెట్ చేసే అవకాశం లేదు. కాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పగతో రగిలిపోతున్నారు. దేవరకు బలమైన గాయమే అయింది. ఆ గాయానికి కారణం మెగా ఫ్యాన్స్. కొరటాల మీద కోపం ఎన్టీఆర్ పై చూపించారు. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదిలే ఛాన్స్ లేదు. కచ్చితంగా రామ్ చరణ్ సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి సినిమాను కూడా ట్రోల్ చేయడం ఖాయంగా కనపడుతోంది. దీనితో గేమ్ చేంజర్ ప్రమోషన్ ను ఎన్టీఆర్ తో చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనిపై త్వరలోనే ఎన్టీఆర్ ను కలిసే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి సినీ వర్గాలు.