ఒకటే దెబ్బతో మూడు పిట్టలు కొడుతున్న ఎన్టీఆర్

సినిమా వాళ్ళల్లో ఎన్టీఆర్ చాలా స్మార్ట్... ఈ కామెంట్ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో ఎన్టీఆర్ కు ఒక లెక్క ఉంటుంది. తనకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ ఒక ప్లానింగ్ తో ఉంటాడు.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 10:38 AM IST

సినిమా వాళ్ళల్లో ఎన్టీఆర్ చాలా స్మార్ట్… ఈ కామెంట్ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో ఎన్టీఆర్ కు ఒక లెక్క ఉంటుంది. తనకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ ఒక ప్లానింగ్ తో ఉంటాడు. విమర్శ వస్తే అవసరమైతే ప్రెస్ మీట్ కూడా పెడతాడు. ఎవరైనా టార్గెట్ చేస్తుంటే వాళ్ళను ఏ కోణంలో సెట్ చేయాలో ఒక స్కెచ్ గీసుకుని రంగంలోకి దిగుతాడు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అదే చేస్తున్నాడు. ఒక్క టూర్ తో నెగటివ్ ప్రచారం మొత్తాన్ని సెట్ చేస్తున్నాడు…

ఇంకో 15 రోజుల్లో దేవర విడుదల అవుతుంది. ట్రైలర్ విడుదల అనంతరం చాలా నెగటివ్ టాక్ వచ్చింది సినిమాకు. సోషల్ మీడియాలో మెగా ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇలా అందరూ దేవరను సైలెంట్ గా టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వరద సాయం పేరుతో ఏపీ వచ్చి చంద్రబాబుతో మీటింగ్ సెట్ చేసాడు. ఏపీ, తెలంగాణాకు చెరో 50 లక్షల విరాళం ప్రకటించిన ఎన్టీఆర్… 50 లక్షల చెక్ ని స్వయంగా చంద్రబాబుని కలిసి అందిస్తారు. వచ్చేటప్పుడు అన్నతోనో భార్యతోనో రావడం లేదు… రామ్ చరణ్ తో కలిసి వస్తున్నాడు.

దీనికి మొత్తానికి ఓ లెక్క ఉంది… చంద్రబాబుని కలిసితే టీడీపీ కార్యకర్తలు నెగటివ్ ప్రచారం ఆపేస్తారు. ఇది ఏపీ తెలంగాణాలో కలిసి వస్తుంది. బాలకృష్ణ ఫాన్స్ కూడా సెట్ అయిపోయే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ తో కలిసి ఫోటోలు బయటకు వస్తే మెగా ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ సెట్ అయిపోతారు. కొరటాల మీద మెగా ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. అందుకే దేవర కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అల్లు అర్జున్ మీద కోపం ఉంది. అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. అందుకే మెగా ఫాన్స్ ఎన్టీఆర్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. సో… ఒక్క టూర్ తో మూడు పిట్టలు కొట్టవచ్చు.