దేవర అప్పుడు ఎవరికీ భయపడ్డాడు…? మేనత్త కంటే సమంతా ఎక్కువా…?

తెలంగాణాలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటిఆర్ లక్ష్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. దీనిపై ఇప్పుడు సినిమా వాళ్ళు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 01:44 PM IST

తెలంగాణాలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటిఆర్ లక్ష్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి. దీనిపై ఇప్పుడు సినిమా వాళ్ళు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చూస్తూ కూర్చోలేం అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు తారక్. కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి కొత్తగా దిగాజారుతున్నారు అంటూ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేసాడు.

పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు, గోప్యత పట్ల గౌరవంగా ఉండి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా చేస్తున్న నిరాధారమైన ప్రకటనలు చూసి బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం ఊరుకోం అని హెచ్చరించాడు. మనం ఇప్పుడు ఉన్న పదవుల కంటే ఇంకా పైకి ఎదగాలన్నాడు. అలాగే ఒకరి గౌరవాన్ని మరొకరు గౌరవంగా చూడాల్సిన అవసరం ఉందని తన పోస్ట్ లో ప్రస్తావించాడు.

ప్రజాస్వామ్య భారతదేశంలో, మన సమాజంలో అటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను కొనసాగకుండా జాగ్రత్తలు తీసుకుందాం అంటూ పోస్ట్ చేసాడు. సమంతాకు మద్దతు ఇవ్వడం బాగానే ఉంది గాని… గతంలో ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరి లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు ఈ స్థాయిలో స్పందించలేదు అంటూ టీడీపీ క్యాడర్ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కనీసం మేనత్త పేరు కూడా తీయలేని పరిస్థితిలో ఎన్టీఆర్ ఉన్నాడని, అప్పుడు ఎవరికి భయపడ్డాడు దేవర అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కంటే ఏపీ అసెంబ్లీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసారని, వాటిపై అప్పుడు సాధారణ ప్రజలు కూడా స్పందించి అసహనం వ్యక్తం చేసారని, కాని మేనత్త అయినా కూడా పేరు కూడా ఎత్తకుండా వీడియో రిలీజ్ చేసావని దేవరను దుమ్మెత్తి పోస్తున్నారు.