Jatiratnalu: ట్రైలర్‌తోనే పరేషాన్‌ చేశారు.. ఇదేం కామెడీ గురూ.. జాతిరత్నాలు 2.0

తిరువీర్‌ హీరోగా రూపక్‌ రొనాల్డ్‌సన్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా పరేషాన్‌. రానా దగ్గుబాటి సమర్పనలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాల రిలీజ్‌ చేశారు. 2 నిమిషాల 33 సెకన్లు ఉన్న ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్టైనింగ్‌గా ఉంది.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 03:38 PM IST

గ్రామంలో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు స్నేహితుల కథే పరేషాన్‌ సినిమా. ట్రైలర్‌ చూస్తుంటే కాస్త అటూ ఇటూగా జాతిరత్నాలు లాంటి సినిమా అనిపిస్తుంది. ఫుల్‌లెంత్‌ ఎటర్టైనర్‌ సినిమాగా పరేషాన్‌ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో దాదాపు అంతా చిన్న యాక్టర్సే. కానీ ప్రతీ ఒక్కరు క్యారెక్టర్‌లో జీవితంచారు. ట్రైలర్‌లో హీరో హరో ఫాదర్‌ మధ్య ఉన్న సీన్స్‌ అయితే నెక్ట్స్‌ లెవెల్‌.

అసలే చదువు ఉద్యోగాలు లేక ఊర్లో తిరుగుతున్న నలుగురు ఫ్రెండ్స్‌ లవ్‌స్టోరీ సినిమాలో డబులు ఎంటర్టైన్‌మెంట్‌ క్రియేట్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన రూపేష్‌ రొనాల్డ్‌సన్‌ హృదయకాలేయం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. తరువాత సంపూర్ణేష్‌ బాబుతో కలిసి కొబ్బరిమట్ట సినిమా తీశాడు. ఇప్పుడు మరోసారి సేమ్‌ ఎంటర్టైన్‌మెంట్‌ జోనర్‌లో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తున్నాడు.

ట్రైలర్‌లో మాత్రం ప్రతీ క్యారెక్టర్‌ డైలాగ్‌ డెలివెరీ అద్భుతంగా ఉంది. యాక్టింగ్‌ విషయంలో అంతా చింపేశారు. ఇక బీజీఎం, సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సిద్ధార్థ్‌ రాల్లపల్లి ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమాను జూన్‌2న రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ వైరల్‌ అవుతోంది. చూసినవాళ్లంతా పాజిటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లో హీరో ఫాదర్‌ ప్రార్థన చేసే సీన్‌కు, డైలాగ్‌ డెలివెరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుందంటున్నారు. ఇక యాక్టింగ్‌ విషయంలో తిరువీర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా యాక్టింగ్‌ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడు. ఇప్పటికే మసూద సినిమాతో హిట్‌ అందుకున్న తిరువీర్‌ ఇప్పడు పరేషాన్‌ సినిమాతో మరో హిట్‌ అందుకోబోతున్నాడు. సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుందంటున్నారు మేకర్స్‌. జూన్‌ 2న రిలీజ్‌ కానున్న ఈ సినిమా థియేటర్స్‌లో ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో చూడాలి.