PAWAN KALYAN: ఒకే స్క్రీన్ మీద.. పవన్, ప్రభాస్, నాని..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇక షూటింగ్ 40శాతం పెండింగ్ ఉన్నట్టుంది. ఏపీ ఎలక్షన్స్ తర్వాత మే ఎండింగ్‌లో ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందట.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 06:51 PM IST

PAWAN KALYAN: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఒకే తెరమీద కనిపిస్తే బాక్సాఫీస్‌లో సునామీనే. అదే ఇప్పుడు నిజంగా మారబోతోంది. 2025 సంక్రాంతికి ఇది వెండితెరమీద సాధ్యం కాబోతోంది. అంతటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజీ మూవీ తీస్తున్న దర్శకుడు సుజీతే. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇక షూటింగ్ 40శాతం పెండింగ్ ఉన్నట్టుంది.

DEVARA: దేవర మూవీలో.. అసలు విలన్ సైఫ్ అలీఖాన్ కాదా..?

ఏపీ ఎలక్షన్స్ తర్వాత మే ఎండింగ్‌లో ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందట. జూన్ ఎండ్‌లోగా ఓజీ షూటింగ్‌ని పూర్తి చేయబోతున్నాడట సుజీత్. తర్వాత ఆగస్ట్‌కి న్యాచురల్ స్టార్ నానితో కొత్త సినిమా ప్లాన్ చేశాడు సుజీత్. విచిత్రం ఏంటంటే, ఈ చిత్రంలో పవన్ కనిపించనుండగా, అలానే పవన్ మూవీ ఓజీలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అలాగని గెస్ట్ రోల్ వేయట్లేదు. సినిమాల్లోని అసలైన రోల్సే అని తెలుస్తోంది. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఒకరి మూవీకి మరో మూవీతో లింక్ ఉండబోతోంది.

ఆల్రెడీ సాహోలో వాజీ సిటీని చూపించిన సుజీత్, ఓజీలో మాత్రం వాజీ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ అని సాహోతో ఓజీకి లింక్ పెట్టాడట. ఇప్పుడు వాజీ వ్యాన్ అంటూ నాని సినిమాకోసం ఓ వ్యాన్‌ని వాడుతున్నాడు. సో.. ఈ మూడు మూవీలకు లింక్ ఉండటం వల్లే, ఒకరికోసం మరొకరు సినిమాలో భాగంగా కనిపించబోతున్నారట.