Pawan Kalyan: ఫ్యాన్స్‌ని పండుగ చేసుకోమంటున్న పవర్ స్టార్..!

ఇప్పటి వరకు తెరకెక్కిన పార్ట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా 80 పర్సెంట్ అయిపోయింది. మరో 20 రోజుల టాకీ పార్ట్ తెరకెక్కితే పోస్ట్ ప్రొడక్షన్‌తో కలుపుకుని మరో 20 రోజుల టైం పడుతుంది. సో.. దీపావళికంటే ముందే ఓజీ ఫస్ట్ కాపీ సిద్దం అయ్యే ఛాన్స్ ఉంది.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 05:10 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సుజీత్ తీస్తున్న మూవీ డిసెంబర్ 14 లేదంటే డిసెంబర్ 20న రావొచ్చని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తవటమే కాదు.. ఇప్పటి వరకు తెరకెక్కిన పార్ట్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా 80 పర్సెంట్ అయిపోయింది. మరో 20 రోజుల టాకీ పార్ట్ తెరకెక్కితే పోస్ట్ ప్రొడక్షన్‌తో కలుపుకుని మరో 20 రోజుల టైం పడుతుంది. సో.. దీపావళికంటే ముందే ఓజీ ఫస్ట్ కాపీ సిద్దం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టే క్రిస్మస్‌కి ఓజీ రావటం 99 శాతం ఫైనల్ అయినట్టే.

ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్. ఇప్పటి వరకైతే రెండో లాంగ్ షెడ్యూల్ నడుస్తోంది. ఈ ఒక్క షెడ్యూల్ లోనే పాతిక శాతం షూటింగ్ పూర్తవుతుందట. అదే జరిగితే.. ఈ వేగం ఇలానే కంటిన్యూ అయితే డిసెంబర్‌లోగా ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వొచ్చు. అలాగని సంక్రాంతికి ఈ సినిమా అందుబాటులోకి రాకపోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉండేలా ఉంది. గ్రాఫిక్ సీన్స్ కూడా భారీగానే వాడారట. ఐతే ఉగాదికి రెండు వారాల ముందు ఉస్తాద్ భగత్ సింగ్‌ని విడుదల చేయాలనుకుంటున్నారట. అంటే మార్చ్ 22 లేదంటే మార్చ్ 29న ఈ సినిమా రావటం కూడా ఫైనల్ అయినట్టే. విచిత్రం ఏంటంటే ఇంకా సెట్స్ పైకెళ్లని సురేందర్ రెడ్డి మూవీ కూడా ఏపీలో ఎలక్షన్స్‌కి ముందే విడుదల చేయాలనుకుంటున్నారు.

అంటే మార్చిలోగా వస్తుందా అంటే, ఎగ్జాక్ట్‌గా ఎలక్షన్స్‌కి ముందే అనలేం కాని, ఏపీలో పొలిటికల్ సందడి జరుగుతున్న టైంలో అంటే మేలో సురేందర్ రెడ్డి సినిమా వస్తుందట. అంత అర్జెంట్‌గా ఈ మూవీని అప్పడే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయటానికి కారణం.. ఇదో పొలిటికల్ సెటైరిక్ మూవీ అని తెలుస్తోంది.