Pawan Kalyan: త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. పవన్‌ కోసం ప్రొడ్యూసర్ల సంచలన నిర్ణయం..

ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. ఏపీలో ఎన్నికలు సమీపించడంతో రూటూ మార్చాడు. ఎన్నికలు ముగిసేవరకూ షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇవ్వాలని అనుకుని వారాహి యాత్ర మొదలు పెట్టారు.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 04:53 PM IST

Pawan Kalyan: ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు అంటూ దూసుకుపోతున్నాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. ఏపీలో ఎన్నికలు సమీపించడంతో రూటూ మార్చాడు. ఎన్నికలు ముగిసేవరకూ షూటింగ్స్‌కు గ్యాప్‌ ఇవ్వాలని అనుకుని వారాహి యాత్ర మొదలు పెట్టారు. కానీ ప్రాజెక్ట్‌లు ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉండటం మంచిది కాకపోవడంతో పవన్‌ యూ టర్న్‌ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

నార్మల్‌గా అయితే యాత్ర షెడ్యూల్స్‌ మధ్య గ్యాప్‌లో హైదరాబాద్‌ వచ్చి పవన్‌ షూటింగ్స్‌ కంప్లీట్‌ చేసుకోవాలి. కానీ ఇది చాలా ఇబ్బందికరం అవడంతో పవన్‌ కళ్యాణ్‌ కోసం ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారట. ప్రజెంట్‌ పవన్‌తో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్లు రెండు రోజుల క్రితం వెళ్లి పవన్‌ను కలిశారు. షూటింగ్‌ కోసం పవన్‌ హైదరాబాద్‌ రాకుండా.. ఏపీలోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేసేలా ప్లాన్‌ చేస్తామని చెప్పారట. దీంతో యాత్రకు ఇబ్బంది కాకుండా, షూటింగ్‌ ఆగిపోకుండా ఉంటుందని చెప్పారట. పవన్‌ కూడా దీనికి ఓకే అన్నట్టు సమాచారం. పవన్‌ చేస్తున్న నాలుగు సినిమాల్లో బ్రో సినిమాలో పవన్‌ పార్ట్‌ పూర్తైంది. ఓజీ దాదాపు సగం కంప్లీట్‌ అయినట్టే. కానీ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, హరిహర వీరమల్లు షూటింగ్‌ మాత్రం ఇంకా సగం కూడా పూర్తి కాలేదు.

ఇలాంటి టైంలో ఆ సినిమా సెట్‌లు ఏపీలో వేసి షూటింగ్‌ చేయాలి అంటే అది బిగ్‌ టాస్క్‌. లోకేషన్స్‌ అయితే ఇక ఇంపాజిబుల్‌. కానీ ప్రొడ్యూసర్లు అంత ధైర్యంగా షూటింగ్‌ ఏపీలోనే చేస్తామని ఎలా చెప్పారా అనేది ఇక్కడ మిలియన్‌ డాలర్స్‌ క్వశ్చన్‌. రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఇలా కథకి సంబంధం లేని ప్రాంతంలో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తే అది మొత్తం సినిమా అవుట్‌పుట్‌ మీదే ప్రభావం చూపే చాన్స్‌ ఉందంటున్నారు క్రిటిక్స్‌. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్‌ కళ్యాణ్‌ ఈ రెండు సినిమాలు ఎలా కంప్లీట్‌ చేస్తాడో చూడాలి.