Pooja Hegde: పూజా హెగ్దే ఇంట్లో విషాదం.. అభిమానులతో బాధను షేర్ చేసుకున్న నటి

పూజా తన కుటుంబ విషయాలకు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోదు. ఎక్కువగా సినిమా అప్‌డేట్స్‌ మాత్రమే పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అలాంటిది పూజా నుంచి ఇలాంటి ఎమోషనల్‌ పోస్ట్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ తెగ ఫీలైపోతున్నారు.

  • Written By:
  • Publish Date - January 13, 2024 / 04:04 PM IST

Pooja Hegde: టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజాహెగ్దే ఇంట్లో పండగవేళ విషాద ఘటన జరిగింది. పూజా హెగ్దే వాళ్ల అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. అమ్మమ్మతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో స్టోరీగా పోస్ట్‌ చేసింది. “వీ మిస్‌ యూ అజి” ఎమోషన్‌ పోస్ట్‌ చేసింది. నిజానికి పూజా తన కుటుంబ విషయాలకు ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోదు. ఎక్కువగా సినిమా అప్‌డేట్స్‌ మాత్రమే పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.

Sreeleela: ఇక చాలు లీల.. పవన్‌ ఫ్యాన్స్‌కు శ్రీలీల భయం.. ఇప్పటికైనా మారమ్మా తల్లీ..

అలాంటిది పూజా నుంచి ఇలాంటి ఎమోషనల్‌ పోస్ట్‌ చూసిన ఆమె ఫ్యాన్స్‌ తెగ ఫీలైపోతున్నారు. పూజకు ధైర్యకు చెప్తూ ఆమెను ఓదారుస్తున్నారు. రీసెంట్‌గానే పూజా హెగ్దే సిస్టర్‌ భూమి శెట్టి పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి పూజా బాగా ఎంజాయ్‌ కూడా చేసింది. కానీ ఆ సంతోషం పూజా ఫ్యామిలీలో ఎక్కువ రోజులు లేదు. కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో ఓ మనిషి చనిపోవడం వాళ్ల ఫ్యామిలీని విషాదంలోకి నెట్టింది. మొన్నటి వరకూ తమతో కలిసి ఉన్న వ్యక్తి.. పెళ్లిలో కూడా తమతో కలిసి ఎంజాయ్‌ చేసిన వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో పూజా ఫ్యామిలీ మొత్తం దుఃఖంలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది పూజా హెగ్దే.

అభిమాన హీరోయిన్‌ నుంచి ఇలాంటి న్యూస్‌ వినడంతో పూజా ఫ్యాన్స్‌ అంతా తెగ బాధపడిపోతున్నారు. పూజ వాళ్ల అమ్మమ్మ ఆత్మకు శాతి కలగాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ధైర్యంగా ఉండాలంటూ పూజ హెగ్దేను ఓదారుస్తున్నారు.