Poonam Kaur: మూడు పెళ్లిళ్లపై పూనమ్ కౌర్ కౌంటర్.. ఈసారి వైసీపీకేనా..?

అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 06:41 PM IST

Poonam Kaur: పూనమ్ కౌర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు పూనమ్ గురించి బాగా తెలుసు. నిత్యం వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్‌గాకంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌‌లపై విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ చేసిన మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?

ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఇండియాలో టెస్లా కార్ల తయారీపై నిర్ణయం తీసుకుంటారు. ఏ రాష్ట్రంలో టెస్లా కార్ల ప్లాంట్ నెలకొల్పుతారో కూడా డిసైడ్ అవుతారు. అందువల్లే తెలంగాణ, గుజరాత్ వంటి అనేక రాష్ట్రాలు టెస్లా పరిశ్రమను తమ రాష్ట్రంలోనే పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ అభిమాని అయిన డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా గురువారం ఈ అంశంపై ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశాడు. తాను ఇండియాలోని ఏపీకి చెందిన వాడినని, ఇండియాలోనే ఏపీ బెస్ట్ స్టేట్ అన్నాడు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజలంతా ఏపీలో టెస్లా కార్లు తయారు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంటే.. ఏపీలో టెస్లా కార్ల తయారీ పరిశ్రమ పెట్టాలని, ఇందుకు ఆయన్ను ఏపీకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇదే అంశంపై పూనమ్ కౌర్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఎలాన్ మస్క్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. దీంతో ఎలాంటి సమస్య లేదా..? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం పెద్ద తప్పు అని, పవన్‌కు క్యారెక్టర్ లేదని విమర్శిస్తారు. అయితే, ఎలాన్ మస్క్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మస్క్‌ను ఆహ్వానిస్తూ ట్వీట్ చేసిన డాక్టర్ ప్రదీప్ చింతా కూడా పలుమార్లు పవన్‌ను మూడు పెళ్లిళ్లపై విమర్శించాడు. అలాంటిది ఇప్పుడు పవన్‌ను తిడుతూ.. మూడుసార్లు పెళ్లి చేసుకున్న ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించడంపైనే పూనమ్ ట్వీట్ చేసింది. ఇదేం సమస్య కాదా.. అంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో మరి వైసీపీ వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.