ఫ్యాన్స్ నందు రెబల్ ఫ్యాన్స్ వేరయా… దమ్ము చూపించడానికి రెడీ అవుతున్నారా…?

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిన మాట అక్షరాలా నిజం. కల్కీ సినిమా తర్వాత ఆ రేంజ్ డబుల్ అయింది. ప్రభాస్ సినిమాల విషయంలో బాలీవుడ్ కు ఇప్పుడు భయపడుతోంది.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 04:54 PM IST

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిన మాట అక్షరాలా నిజం. కల్కీ సినిమా తర్వాత ఆ రేంజ్ డబుల్ అయింది. ప్రభాస్ సినిమాల విషయంలో బాలీవుడ్ కు ఇప్పుడు భయపడుతోంది. కల్కీ సినిమాతో వసూళ్ళ విషయంలో కొత్త టార్గెట్ ఫిక్స్ చేసి కంటి మీద కునుకు లేకుండా చేసాడు బాలీవుడ్ కి. ఇక అక్కడి నుంచి బాలీవుడ్ హీరోలు, అభిమానులు అందరూ ప్రభాస్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ చేసారు. బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ తగ్గించాలని ఆదిపురుష్ సినిమాతో ట్రై చేసినా ఆ తర్వాత సలార్ సినిమా నుంచి స్పీడ్ పెంచాడు.

ఒక్కో సినిమాతో హిట్ కొడుతూ బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు దేవర నుంచి ప్రభాస్ రికార్డులకు కాస్త కంగారు వచ్చింది. కల్కీ, సలార్ సినిమా రికార్డులను విదేశాలతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని బీట్ చేసింది దేవర. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కాగా కొన్ని లెక్కలతో సోషల్ మీడియాలో ప్రభాస్ ను ట్రోల్ చేసారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ త్వరలోనే హైదరాబాద్ లో మీటింగ్ పెడుతున్నారట. ఈ మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విధంగా కొన్ని సూచనలు సలహాలు ఫ్యాన్స్ కి చేయడానికి మ్యాప్ రెడీ చేసారట.

ప్రభాస్ సినిమాలకు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది కాబట్టి… రికార్డులను ఎప్పటికప్పుడు వైరల్ చేయడం, వేరే హీరోల ఫ్యాన్స్ కౌంటర్ లు ఇస్తే వాటికి సమాధానం చెప్పడం, కొత్త కౌంటర్ లు వేయడం వంటి వాటిని ప్లాన్ చేస్తున్నారట రెబల్ ఫ్యాన్స్. రికార్డులతోనే ఇప్పుడు సినిమాలు నడుస్తున్నాయి. సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. కాబట్టి ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి పక్కా లెక్కలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారట. మరి సోషల్ మీడియా వార్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.