ప్రభాస్ జస్ట్ మిస్… మాయ మాటలకు పడిపోలేదు…!

ప్రభాస్ మొన్నే కల్కీ తో 1200 కోట్ల క్లబ లో అడుగుపెట్టాడు. రాజా సాబ్ మూవీతో ఏప్రిల్ లో దండయాత్ర చేయబోతున్నాడు. సలార్ హిట్ తర్వాత కల్కీ బ్లాక్ బస్టర్ అవటంతో, పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా మారబోతున్నాడు రెబల్ స్టార్.

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 02:16 PM IST

ప్రభాస్ మొన్నే కల్కీ తో 1200 కోట్ల క్లబ లో అడుగుపెట్టాడు. రాజా సాబ్ మూవీతో ఏప్రిల్ లో దండయాత్ర చేయబోతున్నాడు. సలార్ హిట్ తర్వాత కల్కీ బ్లాక్ బస్టర్ అవటంతో, పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఒకే ఒక్క హీరోగా మారబోతున్నాడు రెబల్ స్టార్. ఇంతవరకు ఆ క్రెడిట్, రికార్డు ఎవరికీ దక్కలేదు. కాకపోతే బాహుబలి, బాహుబలి 2 తర్వాత సాహోతో అలాంటి రికార్డు దక్కేది, కాని సాహో హిందీలోనే భారీగా వసూల్లు రాబట్టి, సౌత్ లో ఆ స్థాయి వసూళ్లు రాబట్టకపోవటంతో, అలా ఆచాన్స్ మిస్ అయ్యింది.

ఏదేమైనా సలార్, కల్కీ తర్వాత రాజా సాబ్ హిట్ మెట్టెక్కి పాన్ ఇండియా హాట్రిక్ సొంతం చేసుకన్న స్టార్ గా రెబల్ స్టార్ కి రికార్డు దక్కబోతోంది. అలానే మరో లా కూడా రాజా సాబ్ ప్రభాస్ కి హెల్ప్ అవుతోంది. పరోక్షంగా తనని ఓ పెద్ద గండం నుంచి గట్టెక్కించింది.

నిజానకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్రభాస్ సినిమా సెట్స్ పైకెళ్లేదట. మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేసిన రాజాసాబ్ నిజానికి సెట్స్ పైకెళ్లకముందు, మాటల మాంత్రికుడి కథ విన్నాడట రెబల్ స్టార్. ఐతే మారుతికి, అలానే యూవీ ప్రొడక్షన్ ని ముందే కమిట్మెంట్ ఇవ్వటంతో, త్రివిక్రమ్ సినిమాను హోల్డ్ లో పెట్టాడని, దీంతో తను మహేశ్ బాబు సినిమాతో జర్నీ చేశాడని అంటున్నారు

అలా సూపర్ స్టార్ కి గుంటూరు కారంతో పంచ్ పడింది. లేదంటే అదే కథ కాకున్నా, ఏదో ఒక కథతో, ప్రభాస్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేంది. కాని ఆలోపే మారుతికి ఇచ్చిన మాట వల్ల రాజా సాబ్ సెట్స్ పైకెళ్లకుండానే, త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా కాపాడిందంటున్నారు. మొత్తంగా త్రివిక్రమ్ తో సినిమా అంటే హీరోలకి మూడింది అనేలా ప్రచారం చేస్తున్నారు.