Priyanka Chopra: అయ్యో పాపం.. ఇల్లు లేక రోడ్డునపడ్డ ప్రియాంక చోప్రా.. మరీ ఇంత మోసమా..

పాప్‌ సింగర్‌ నిక్‌ను లవ్‌ మ్యారేజీ చేసుకున్న ప్రియాంక చోప్రా.. లాస్ ఏంజిల్స్‌లో సెటిల్ అయింది. 2019లో 20 మిలియన్‌ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 165 కోట్ల రూపాయలతో ఓ పెద్ద బిల్డింగ్‌ కొనుక్కున్నారు.

  • Written By:
  • Updated On - February 2, 2024 / 06:39 PM IST

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఇల్లు లేక రోడ్డునపడింది. ఏంటి జోక్‌ చేస్తున్నారా అనుకోకండి.. నిజమే ! మోసపోయి, ఇల్లు పోయి.. దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రియాంక, నిక్ జొనాస్ దంపతులు.. తమ డ్రీమ్‌హౌస్‌ నుంచి నుంచి బయటకు వచ్చేశారు. పాప్‌ సింగర్‌ నిక్‌ను లవ్‌ మ్యారేజీ చేసుకున్న ప్రియాంక చోప్రా.. లాస్ ఏంజిల్స్‌లో సెటిల్ అయింది. 2019లో 20 మిలియన్‌ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 165 కోట్ల రూపాయలతో ఓ పెద్ద బిల్డింగ్‌ కొనుక్కున్నారు.

Thalapathy Vijay: తమిళగ వెట్రి కళగం పేరుతో దళపతి విజయ్ కొత్త పార్టీ..

అప్పటి నుంచి ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఐతే ఇప్పుడు వాళ్లిద్దరూ ఆ ఇంటిని వదిలేసి బయటకు వచ్చేశారు. ఆ ఇంటిని అమ్మిన వ్యక్తితో.. ఇప్పుడు న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియాంక డ్రీమ్ హౌస్‌లో నీళ్లు లీక్‌ అవుతుండటం పెద్ద సమస్యగా మారిందట. ఇంట్లోని చాలా ప్రదేశాలు డ్యామేజ్‌ అయ్యాయట. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రియాంక, నిక్ దంపతులు ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. విలాసవంతమైన ఆ ఇంటిలో 7 బెడ్రూమ్‌లు, 9 బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్‌ థియేటర్, స్పా, స్టీమ్ షవర్, జిమ్‌, బిలియర్డ్స్ రూమ్‌లాంటివి ఉన్నాయ్. తమ పిల్లలతో గడిపే ప్రతీ క్షణాన్ని ఓ మెమొరీలా మార్చుకునేందుకు.. ప్రియాంక, నిక్‌ దంపతులు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. తమ టేస్టుకు అనుగుణంగా మార్పులు చేయించుకున్నారు. ఔట్‌డోర్‌ స్పేస్‌ పెంచుకున్నారు. పచ్చదనం ఎక్కువ ఉండేలా చూసుకున్నారు.

ఐతే నీటి తొట్టె, స్పా నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయట. ఇంటిని కొనుగోలు చేసిన కొన్ని రోజులకే… ప్రియాంక, నిక్ దంపతులు ఈ సమస్యను గుర్తించారు. ఇంచుమించు అదే సమయంలో బార్బిక్యూ ప్రాంతంలోనూ నీళ్లు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. అలా లీక్ అవుతున్న నీటి కారణంగా ఇంట్లోని వస్తువులు, ఇతర ప్రాంతాలు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఇల్లు అమ్మిన వ్యక్తిపై ప్రియాంక, నిక్ దంపతులు 2023 మేలో కోర్టులో దావా వేశారు. నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే సమస్య తీరకపోగా.. కొత్తగా ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడి.. ఇప్పుడు ప్రియాంక దంపతులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.