Pushpa-2: పుష్పరాజ్ వేట.. జపాన్‌లో పుష్ప 2 రిలీజ్

పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ఇటుగా అంచనాలతో వచ్చిన పుష్పరాజ్ పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంతా కాదు.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 02:28 PM IST

Pushpa-2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధారణ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీలను మాత్రమే కాకుండా.. ఆఖరికి రాజకీయ నాయకులను కూడా కదిలించింది. అందరూ తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైనా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అది పుష్ప కోసమనే చెప్పాలి. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ఇటుగా అంచనాలతో వచ్చిన పుష్పరాజ్ పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంతా కాదు.

Rajinikanth: రియల్ హీరో.. పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం.. దటీజ్ రజినీకాంత్

అందుకే పుష్ప 2కి సంబంధించి సుకుమార్‌పై బాధ్యత ఇంకా పెరిగింది. పుష్ప మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది. అందుకే పుష్ప 2 సినిమా రేంజ్ కూడా అలాగే పెరుగుతుంది. సాధారణంగా ఒక సినిమా హిట్టైతే ఆ తర్వాత వచ్చే సీక్వెల్ మీద భారీగా అంచనాలు నెలకొంటాయి. అంతేకాకుండా ఆ సినిమా మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకు మంచి ఉదారణగా కేజీఎఫ్ సినిమాని చెప్పచ్చు. అలాగే ఒక హిట్టైన సినిమాకి సీక్వెల్ తీస్తున్నప్పుడు డైరెక్టర్ మీద కూడా అంతే ఒత్తిడి, బాధ్యత కూడా ఉంటుంది. దానిని సుకుమార్ పక్కా ప్రణాళికతో హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అసలు కథ పుష్ప రూల్‌లోనే ఉటుందని అందరికీ తెలిసిందే. సిండికేట్‌ని తన చేతుల్లోకి తీసుకుని పుష్పరాజ్ ఎంత ఎత్తుకు ఎదిగాడు.. ఎంత పవర్ ఫుల్‌గా మారాడు అనే విషయాలు ఈ సీక్వెల్‌లోనే ఉంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా రష్మిక టోక్యోలో పర్యటించింది. అక్కడ శ్రీవల్లిని చూసి తెగ ఖుషి అయ్యారు ఫ్యాన్స్. అయితే వారి అభిమానాన్ని చూసి రష్మిక సైతం ఎమోషనల్ అయ్యారు.

ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడి వెళ్లిన ఈ బ్యూటీ.. పుష్ప 2 గురించి అదిరిపోయే న్యూస్ చెప్పింది. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రష్మిక.. పుష్ప2ను జపాన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. పైగా మేకర్స్ ఆ వైపు అడుగులు వేస్తున్నారని చెప్పి.. అక్కడి ఫ్యాన్స్‌ను ఖుషి చేసింది. చూస్తుంటే పుష్పరాజ్ రూలింగ్ పాన్ ఇండియ లోనే కాదు పాన్ వరల్డ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోంది.