Rajamouli : రాజమౌళి సంచలన ప్రెస్ మీట్..

ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయి.. జస్ట్ అనౌన్స్మెంట్‌తోనే సంచలనానికి రెడీ అవుతున్న కాంబినేషన్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్‌, రాజమౌళి సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయి.. జస్ట్ అనౌన్స్మెంట్‌తోనే సంచలనానికి రెడీ అవుతున్న కాంబినేషన్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్‌, రాజమౌళి సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే.. నాటు నాటు పాటకు (Natu Natu song) ఆస్కార్ (Oscar) అందుకొని.. హాలీవుడ్‌ని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు రాజమౌళి. అప్పటి నుంచి జక్కన్న (Jakkana) నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యావత్ ప్రంపంచం అంతా ఎదురు చూస్తోంది.

రాజమౌళి (Rajamouli), మహేష్ (Mahesh Babu) ఇద్దరు కూడా సినిమా ఉందని పలు సందర్భాల్లో చెబుతు వస్తున్నారు. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. త్వరలోనే అంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. ఫైనల్‌గా ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా వినిపిస్తున్నట్టుగా.. ఉగాదికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు.

ఏప్రిల్ 9న ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా జక్కన్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. అదేరోజు టైటిల్‌ తో పాటు స్టార్ క్యాస్టింగ్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే.. ఈ సినిమా ఓపెనింగ్‌కు హాలీవుడ్ (Hollywood) దర్శక దిగ్గజాలకు ఆహ్వానిస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు ప్రెస్‌ మీట్‌తోనే సంచలనానికి రెడీ అవుతున్నాడట జక్కన్న. ఈలోపు మహేష్‌ కమిట్ అయిన యాడ్స్‌ షూటింగ్‌ కంప్లీట్ చేయనున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ ఫైనల్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా.. మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజు మాత్రం ఓ సంచలనమే అని చెప్పాలి.