Rajisha Vijayan: ప్రేమలోకం.. కెమెరామెన్ ప్రేమలో రవితేజ హీరోయిన్..

లంగా ఓణీలో ఎంతో చక్కగా ఇమిడిపోయిన రజిషా.. బబ్లింగ్ పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె ప్రముఖ కెమెరామాన్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా టోబిన్ తన ఇనిస్టాగ్రమ్‌లో రజిషా, తను కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేశాడు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 06:14 PM IST

Rajisha Vijayan: ప్రేమకి మేమేమి అనర్హులం కాదంటు సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గరనుంచి ఎంతో మంది హీరోయిన్లు ప్రేమలో పడుతూనే వస్తున్నారు. అలాగే ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ప్రేమని గెలిపించుకుంటూ వస్తున్నారు. కానీ కొంత మంది హీరోయిన్లు అయితే మాత్రం తమ ప్రేమ గురించి ఎవరికి చెప్పరు. మరికొంతమంది మాత్రం తమ ప్రియుడి ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిస్తారు. తాజాగా ఒక హీరోయిన్ మీద ఇప్పుడు ఇదే విధమైన అనుమానం వస్తుంది.

VISHAL: ఇప్పట్లో లేనట్లేనా.. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదా..?

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీలో రవితేజతో ఆడిపాడిన నటి రజిషా విజయన్. లంగా ఓణీలో ఎంతో చక్కగా ఇమిడిపోయిన రజిషా.. బబ్లింగ్ పెర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె ప్రముఖ కెమెరామాన్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా టోబిన్ తన ఇనిస్టాగ్రమ్‌లో రజిషా, తను కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేశాడు. ‘1461 రోజులు నీతో కలిసి ఉన్నాను. ఆ సమయంలో కలిగిన ప్రేమ, సంతోషం మర్చిపోలేనిది. అలాగే ఇద్దరం మన అల్లరిని భరిస్తూ మరిన్ని ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. రజిషా కూడా ఆ పోస్ట్‌కి పాజిటివ్‌గా రిప్లై ఇచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ వైరల్‌గా మారింది. అలాగే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా అంటున్నారు. ఇక రజిషా, టోబిన్‌లు గతంలో ఖోఖో, లవ్లీ యువర్స్ చిత్రాలకి కలిసి పని చేసారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రజిషా అనుమతితోనే థామస్ ఆ పిక్స్‌ని తన ఇన్‌స్టాలో షేర్ చేసాడని కూడా అంటున్నారు.