Rakul Preet Singh: పెళ్లి వేడుక.. ఒక్కో రూమ్ రెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే..

రకుల్, భగ్నానీ పెళ్లి వేడుక.. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవా అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో జరగబోతోంది. కాగా.. ఈ స్టార్‌ హోటల్‌లోని ఒక్కో రూమ్‌ రెంట్‌కి సంబంధించిన వార్త ఇప్పుడు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ పెళ్లి కోసం సరికొత్తగా ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకున్నారు ఈ జంట.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 01:12 PM IST

Rakul Preet Singh: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కునుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్‌ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 21న గోవాలో రకుల్, భగ్నానీ వివాహం జరగబోతోంది. తమ వివాహ వేడుకను ఈ లవ్ బర్డ్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బ్యూటీపుల్ కపుల్ పెళ్లి వేడుక గురించి కొన్ని ఆసక్తికర వివరాలు బయటకి వచ్చాయి.

Vijay devarakonda: ముద్దుగుమ్మల ఫైట్.. విజయ్ పక్కన ఛాన్స్ ఎవరికి..?

రకుల్, భగ్నానీ పెళ్లి వేడుక.. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ గోవా అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో జరగబోతోంది. కాగా.. ఈ స్టార్‌ హోటల్‌లోని ఒక్కో రూమ్‌ రెంట్‌కి సంబంధించిన వార్త ఇప్పుడు నెటిజన్లకు షాకిస్తోంది. ఈ పెళ్లి కోసం సరికొత్తగా ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకున్నారు ఈ జంట. ఈ పెళ్లి వేడుకల్లో డీజే, ప్లాస్టిక్ వాడకం, పేపర్ వాడకం కానీ ఉండవని తెలుస్తోంది. అయితే.. పెళ్లి విషయంలో ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకున్న రకుల్, జాకీ ఖర్చు మాత్రం భారీగానే చేయనున్నారట. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ పెళ్లి వేడుక కోసం సౌత్ గోవాలోని 45 ఎకరాల ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌ హోటల్‌‌ను బుక్ చేసుకున్నారట. ఇది గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్స్‌లో ఒకటి. ఒక్కో రూమ్ ఖరీదు రూ.19 వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని టాక్. రకుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భగ్నానీల పెళ్లి కోసం మొత్తం మూడు రోజుల పాటు ఐటీసీ హోటల్‌ను బుక్ చేసుకున్నారట. బీచ్ పక్కనే ఎంతో అందంగా ఈ రిస్టార్‌ని నిర్మించారు. ఇండియా, పోర్చుగీస్ విలేజ్ స్టైల్‌లో రిసార్ట్‌ని నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇక.. కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్‌తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్‌లో కూడా రకుల్‌కి కలసి రాలేదు. ఈ క్రమంలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ పొడుగు కాళ్ల సుందరి.. పెళ్లి తర్వాత కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక రకుల్, భగ్నాన్ని పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని జంట తమ పెళ్ళికోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. పెళ్లి కోసం ఎకో ఫ్రెండ్లీ థీమ్‌ను ఎంచుకున్న ఈ జంటపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తన్నారు.