Sharwanand: గ్రాండ్‌గా శర్వానంద్‌ రిసెప్షన్‌.. ఉపాసనతో చెర్రీ అదిరిపోయే ఎంట్రీ..!

రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అవడంతో క్లోజ్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. దీంతో రిసెప్షన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు శర్వానంద్.

  • Written By:
  • Publish Date - June 10, 2023 / 11:18 AM IST

Sharwanand: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న శర్వానంద్‌ రీసెంట్‌గా హస్బెండ్‌గా మారిపోయాడు. ఈ నెల 3న రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అవడంతో క్లోజ్‌ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రమే పెళ్లికి హాజరయ్యారు.

దీంతో రిసెప్షన్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు శర్వానంద్. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో శర్వానంద్‌ రిసెప్షన్‌ జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్‌ స్నేహితులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన కీలక వ్యక్తులు హాజరయ్యారు. తెలంగాణ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌, రాజ్యసభ ఎంపీ సంతోష్‌, హీరో వెంకటేష్‌, బాలకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అటు సినీ ప్రముఖులు దిల్‌రాజు, త్రివిక్రమ్, అల్లరి నరేష్‌, రాజశేఖర్‌ కూడా హాజరయ్యారు. శర్వానంద్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి రిసెప్షన్‌కు వచ్చాడు. ప్రెగ్నెంట్‌గా ఉన్న ఉపాసన చేయి పట్టుకుని రామ్‌ చరణ్‌ ఇచ్చిన ఎంట్రీ ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది.

ఈ ఈవెంట్‌ మొత్తానికి ఉపాసన, రామ్‌ చరణ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు కూడా రామ్‌ చరణ్‌ ఉపాసనతో కలిసి వచ్చాడు. తాను ఎంతో బిజీగా ఉన్నా రాజస్థాన్‌ వెళ్లి మరీ శర్వా పెళ్లికి అటెండ్‌ అయ్యాడు. ఇక చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. ఇలా రాజకీయ సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితుల మధ్య శర్వానంద్‌ రిసెప్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది.