RamCharan: బర్త్‌ డే రోజు బాబాయికి గిఫ్ట్‌ ఇవ్వబోతున్న చెర్రీ..

గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌కు ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ట్రిపులార్‌ సినిమా తరువాత చెర్రీ క్రేజ్‌ ఇండియా వైడ్‌గా పెరిగిపోయింది. ఇక ఇంత క్రేజ్ ఉన్న హీరో బర్త్‌ అంటే సెలబ్రేషన్స్‌ మమూలుగా చేస్తారా. ఖచ్చితంగా టాప్‌ లేపేస్తారు.

గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌కు ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ట్రిపులార్‌ సినిమా తరువాత చెర్రీ క్రేజ్‌ ఇండియా వైడ్‌గా పెరిగిపోయింది. ఇక ఇంత క్రేజ్ ఉన్న హీరో బర్త్‌ అంటే సెలబ్రేషన్స్‌ మమూలుగా చేస్తారా. ఖచ్చితంగా టాప్‌ లేపేస్తారు. ఈ నెల 27న రామ్‌ చరణ్‌ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు ఫ్యాన్ ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ట్రిపులార్‌ లాంటి హిట్‌, దానికి తోడు ఆస్కార్‌ అవార్డ్‌ గెలవడం.. ఇంకేముందు ఈసారి సెలబ్రేషన్స్‌ పీక్స్‌లో ఉంటాయి. అయితే ఈ బర్త్‌డేకు తన బాబాయి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు రామ్‌ చరణ్‌. ఆరెంజ్‌ సినిమాను రీరిలీజ్‌ చేసి.. దాని ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే చిత్ర నిర్మాత నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి మొదట మగధీర సినిమా రిలీజ్‌ చేద్దామనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో ఆరెంజ్‌ సినిమాను రిలీజ్‌ చేద్దామని డిసైడయ్యారట. థియేటర్‌కు ఆడియన్స్‌ను రప్పించలేకపోయినా.. ఆరెంజ్‌ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ ఈ సినిమా కారణంగా నాగబాబు చాలా నష్టపోయారు. నిర్మాతగా పెద్ద దెబ్బ తిన్నారు. కానీ సినిమా మాత్రం యూత్‌ను బాగా ఎట్రాక్ట్‌ చేసింది. ఈ కారణంగానే ఈ సినిమాను మరోసారి రిలీజ్‌ చేద్దామనుకున్నారు నాగబాబు. దాని ద్వారా వచ్చిన డబ్బుతో పార్టీకి ఫండ్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ న్యూస్‌ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌తో పాటు జనసేన కార్యకర్తల్లో ఫుల్‌ జోష్‌ నింపింది. పవన్‌ కళ్యాణ్‌కు అండగా ఉండేందుకు రామ్‌ చరణ్‌, నాగబాబు తీసుకున్ని నిర్ణయంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ కుషీ అవుతున్నారు. అటు రాజకీయంగా కూడా తన బాబాయి పిలిస్తే ఖచ్చితంగా ప్రచారానికి వస్తానంటూ చరణ్‌ చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు తన సినిమా ద్వారా ఆర్థిక సహాన్ని అందిస్తున్నాడు. జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ అండ ఎప్పటికీ ఇలాగే ఉండాలని జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు.