Ram Charan: గేమ్ ఛేంజర్‌లో సగం గేమ్ ఛేంజ్ అయ్యిందా..?

ఎప్పుడో టాకీ పార్ట్ పూర్తైందని ఎనౌన్స్ చేసిన శంకర్.. మధ్యలో భారతీయుడు 2 పెండింగ్ పని మొదలు పెట్టాక, గేమ్ ఛేంజర్ సినిమాను విడతల వారీగా తీస్తున్నాడు. అదేదో సీరియల్ తీసినట్టు. అలా తీసినా ఈపాటికి ఎప్పుడో మూవీ పూర్తవ్వాలి.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 06:24 PM IST

Ram Charan: గేమ్ ఛేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ ఆదివారం నుంచి మొదలు కానుంది. శనివారం హీరోలేని సీన్లు తీస్తారు. ఆదివారం నుంచి మిగిలిపోయిన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ సీన్లు తీయనున్నారు. కైరా అద్వానీ కూడా కోర్ట్ రూమ్ సీన్ల కోసం సెట్లో అడుగు పెట్టబోతోంది. ఇప్పటి వరకు పాట లీకవ్వటం వల్ల వార్తల్లో ఉన్న ఈ సినిమా పేరు, ఇప్పుడు షూటింగ్ వల్ల మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇక్కడ సాధారణంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఎప్పుడో టాకీ పార్ట్ పూర్తైందని ఎనౌన్స్ చేసిన శంకర్.. మధ్యలో భారతీయుడు 2 పెండింగ్ పని మొదలు పెట్టాక, గేమ్ ఛేంజర్ సినిమాను విడతల వారీగా తీస్తున్నాడు.

అదేదో సీరియల్ తీసినట్టు. అలా తీసినా ఈపాటికి ఎప్పుడో మూవీ పూర్తవ్వాలి. కాని కావట్లేదు. అదేదో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ రెండింటి షూటింగ్ ఒకేసారి మొదలైనట్టు చేస్తున్నారు. నిజానికి గేమ్ ఛేంజర్‌లో ఫ్లాష్ బ్యాక్ సీన్ కేవలం పావుగంటే ప్లాన్ చేశారట. కాని తర్వాత మారిన స్క్రిప్ట్ వల్ల సీనియర్ రామ్ చరణ్ పాత్ర నిడివి పెరగటం, స్క్రిప్ట్ మారటంతో లెక్కలు మారాయి. లేటెస్ట్‌గా అందిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. కాని మారిన స్క్రీప్ట్ వల్ల పూర్తైన మొత్తం మూవీలో మళ్లీ 50 శాతం మారుస్తున్నారట. అందుకే రామాయణం, మహాభారతంలా ఈ సినిమా షూటింగ్ కూడా జీడిపాకంలా సాగుతూనే ఉంది.