Ram Gopal Varma: వ్యూహం ప్రి రిలీజ్ ఈవెంట్‌.. చంద్రబాబు, పవన్‌కు ఆహ్వానం పంపిన ఆర్జీవీ

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘వ్యూహం.. జనగర్జన’ పేరిట ఈ నెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. దీనికి చంద్రబాబు, పవన్, లోకేష్‌ను ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఇన్వైట్ చేశారు.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 06:37 PM IST

Ram Gopal Varma: ఏపీ ఎన్నికల ముందు ఆర్జీవీ.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘వ్యూహం.. జనగర్జన’ పేరిట ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. దీనికి చంద్రబాబు, పవన్, లోకేష్‌ను ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ఇన్వైట్ చేశారు.

BHOLA SHANKAR: రీ’మేకులు’.. 2023లో కలిసిరాని రీమేకులు..!

వీరితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వానం పలుకుతున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే ఈ సినిమాలో.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్స్ రిలీజ్ కాగా.. ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వర్మ, వ్యూహం సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా, ఏపీ రాజకీయాలపై ఏ విధంగా ప్రభావితం చూపుతుందో చూడాలి.