Ram Gopal Varma: జగన్‌, భారతిని దింపేశాడుగా.. ఆర్జీవీ వ్యూహంతో కొత్త రచ్చ..

ఏపీ రాజకీయాలను ఆర్జీవీ వాడుకున్నట్లు.. ఎవరూ వాడుకోలేరేమో బహుశా ! ప్రతీ మూమెంట్‌కు విజువల్‌ రూపం ఇస్తున్నాడు ఆర్జీవీ ! అప్పుడెప్పుడో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ రచ్చ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా.. టీడీపీకి కోపం వచ్చేలా కామెంట్ల మీద కామెంట్లు సోషల్‌ మీడియాలో పెడుతూ.. ఎంజాయ్‌ చేస్తున్న వింత జీవి ఆర్జీవీ. వైసీపీ మనిషేమో అనే అనుమానం దాదాపు ఫిక్స్ అయిపోయిన వేళ.. ఓ వ్యూహం రచించాడు ఆర్జీవీ.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 08:06 PM IST

ఇదేమో ఎన్నికల వ్యూహం కాదు. సినిమా వ్యూహం.. వ్యూహం పేరుతో సినిమా ఇది ! ఏపీ రాజకీయాల్లో పరిణామాలపై రెండు భాగాలుగా సినిమా తీస్తానని ఈ మధ్యే చెప్పిన ఆర్జీవీ.. రోల్‌ కెమెరా అనేశాడిప్పుడు ! మొదటి భాగానికి వ్యూహం, రెండో భాగానికి శపథం అనే టైటిల్స్ ఫిక్స్ చేశాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఏపీ రాజకీయాలతో పాటు.. టాలీవుడ్‌లోనూ సంచలనం క్రియేట్‌ చేశాడు.

లేటెస్ట్‌గా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని చెప్తూ.. ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేశాడు. వైఎస్‌ జగన్‌, భారతి పాత్రలో యాక్ట్ చేయబోయేది ఎవరనేది రివీల్ చేశాడు. వివేకా కేసు చుట్టూ ఫస్ట్ పార్ట్ అంతా స్టోరీ రన్ కాబోతోందన్నది అర్థం అవుతోంది క్లియర్‌గా ! తెల్లవారుఝామున వివేకా మృతికి సంబంధించి కాల్ రావడం.. పడుకున్న జగన్ లేచి ఫోన్ మాట్లాడుతూ టెన్షన్ పడడం.. జగన్‌ను చూస్తూ భారతి టెన్షన్ గా కనిపించడం.. ఒక్క ఫొటోలోనే స్టోరీ ఏంటో చెప్పేశాడు ఆర్జీవీ.

వైఎస్ ఫొటోపై చేయి పెట్టి.. అలా దిగాలుగా చూస్తూ ఏం చేయాలో తెలియడం లేదు అన్నట్లు జగన్ పాత్రలో ఉన్న యాక్టర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మరింత క్యూరియస్‌గా కనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో జగన్ పాత్రలో కనిపించిన అజ్మల్ అమీర్.. ఈ మూవీలోనూ అదే రోల్ ప్లే చేయబోతున్నారు. వైఎస్ భారతి రోల్‌లో మానస రాధాకృషన్ యాక్ట్ చేస్తోంది. మూవీలోని వీరిద్దరి లుక్స్ చుసిన ఆడియన్స్.. అచ్చు దించేశారుగా.. ఏమైన డూప్‌లను పట్టడంతో ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా.. ఈ ఫొటోలతోనే బజ్ క్రియేట్ అయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో టీడీపీ అంతు దాదాపు చూసిన వర్మ.. వ్యూహంతో ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడో మరి !