Vyooham: ఆర్జీవీకి ఊరట.. వ్యూహం సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

ఇప్పుడీ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా విడుదలకు అంగీకరిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమాను దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 03:39 PM IST

Vyooham: దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన పొలిటికల్ ఫిలిం వ్యూహం. ఎప్పుడో పూర్తైన ఈ సినిమా సెన్సార్ అడ్డంకులతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడీ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా విడుదలకు అంగీకరిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమాను దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

Yatra 2 Review: వైఎస్ జగన్ బయోపిక్.. యాత్ర 2 మెప్పించిందా..? సినిమా ఎలా ఉంది..?

సెన్సార్ కూడా గత ఏడాదే పూర్తై, విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ నేత నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను కించపరిచేవిధంగా ఉందని ఆరోపిస్తూ నారా లోకేశ్‌తోపాటు మరికొందరు సినిమా విడుదల ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు. దీంతో సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. అనంతరం దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. చిత్ర దర్శక, నిర్మాతలు కూడా సినిమాను విడుదల చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ చిత్ర విడుదల అంశాన్ని సెన్సార్ బోర్డు దగ్గరే తేల్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన కోర్టు.. మరోసారి సెన్సార్‌ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికెట్‌ జారీ చేయాల్సిదిగా ఆదేశించింది. హైకోర్టు సూచనతో సెన్సార్‌ బోర్డు మరోసారి సినిమాను చూసింది. తాజాగా సినిమాకు యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీంతో ఈ నెల 16న సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత సిద్ధం చేసుకున్నారు.