Rashmika Mandanna: క్రేజీ ప్రాజెక్టుల్లో కన్నడ బ్యూటీ.. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో రష్మిక బిజీ..!

ఛలో మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక మందన్న గీత గోవిదంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తర్వాత వచ్చిన పుష్పతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసిన రష్మిక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది.

  • Written By:
  • Updated On - October 8, 2023 / 07:01 PM IST

Rashmika Mandanna: హీరోయిన్‌కి తాటికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు. అవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అప్పుడే పాన్ ఇండియా రేంజ్‌లో హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ వైడ్‌గా స్టార్ డమ్ దక్కుతుంది. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్‌నే ఎంజాయ్ చేస్తోంది ఓ కన్నడ కస్తూరి. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. ఛలో మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక మందన్న గీత గోవిదంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

తర్వాత వచ్చిన పుష్పతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేసిన రష్మిక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ప్రజెంట్ తన చేతిలో ఉన్న సినిమాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రజెంట్ పుష్ప2 షూటింగ్‌తో బిజీగా ఉన్న రష్మిక మందన్న బాలీవుడ్‌లో యానిమల్ అనే మూవీ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్1న సౌత్, నార్త్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్‌గా ఈ కన్నడ కస్తూరి ఛాన్స్ కొట్టేసింది.

తమిళ స్టార్ హీరో విక్రమ్‌‌తో కలిసి ఓ సినిమా చేయడానికి రష్మిక ఓకే చెప్పిందట. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’కి దర్శకత్వం వహించిన జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇక బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించనున్న ‘ఛవా’ అనే హిస్టారికల్ మూవీలో రష్మిక ప్లేస్ కన్ఫామ్ చేసుకుంది. తెలుగులో ‘రెయిన్ బో’ అనే ఉమేన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది. మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దేశ వ్యాప్తంగా సత్తా చాట్టేందుకు నేషనల్ క్రష్ రెడీ అవుతోంది.