కూర్గ్ లో రష్మికకు యాక్సిడెంట్…? ఇప్పుడెలా ఉంది…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు పెద్దగా వార్తల్లో కనపడటం లేదు. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమె గురించి వార్తలు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఆమె ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే దానిపై అసలు క్లారిటీ రావడం లేదు.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 01:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు పెద్దగా వార్తల్లో కనపడటం లేదు. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆమె గురించి వార్తలు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఆమె ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే దానిపై అసలు క్లారిటీ రావడం లేదు. సినిమా నిర్మాతగా మారుతున్నారని, స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నారని ఇలా యేవో వార్తలు వస్తున్నాయి గాని ఆమె మాత్రం పెద్దగా కనపడటం లేదు. కొందరు అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి విదేశాలకు వెళ్ళింది అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

ఇక మరికొందరు అయితే విజయ్ దేవరకొండను వివాహం చేసుకునే ఆలోచనలో ఉందని అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని అంటున్నారు. ఇవన్నీ నిజం కాదని ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసింది ఆమె. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది రష్మిక. గ‌త నెల రోజులుగా నేను యాక్టివ్‌గా లేను అని… గత నెలలో నాకు యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు కోలుకున్నాను అంటూ త‌న ఇన్స్టాలో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది. తాను ప్ర‌స్తుతం వైద్యుల సూచ‌న మేర‌కు ఇంట్లోనే ఉంటున్నాన‌ని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్ కు హాజరవుతాన‌ని స్పష్టం చేసింది.

దీనితో అసలు రష్మికకు ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. ఆమెకు రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని కన్నడ కథనాల ప్రకారం ఆమె కారు కూర్గ్ సమీపంలో ఒక ఘాట్ రోడ్ లో ప్రమాదానికి గురైందని వెల్లడిస్తున్నాయి. ఆ కారుని రష్మిక స్వయంగా డ్రైవ్ చేస్తున్నారని… ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అందుకే రష్మిక ఆ విధంగా పోస్ట్ చేసారని సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాలో నటిస్తున్న్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.