నిర్మాతకు భారీ ఆఫర్ ఇచ్చిన మాస్ మహారాజ

మాస్ మహారాజా రవితేజా హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా అట్టర్ ఫ్లాప్ అయింది.

  • Written By:
  • Publish Date - September 5, 2024 / 06:20 PM IST

మాస్ మహారాజా రవితేజా హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా అట్టర్ ఫ్లాప్ అయింది. హిట్ కథను సరిగా హ్యాండిల్ చేయలేదు అనే ఆరోపణలు వినిపించాయి. దానికి తోడు హీరోయిన్ పై పెట్టిన శ్రద్ధ సినిమాపై ఏ విధంగా కూడా పెట్టలేదనే టాక్ వచ్చింది. రవితేజా కూడా కథ విషయంలో వెనకా ముందు చూడకుండా సినిమాకు సైన్ చేసారని అందుకే ఆయనకు ఈ మధ్య కాలంలో సరైన విజయాలు దక్కడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి.

సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కూడా ట్రోల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు రవితేజా. మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాకు కేవలం 13 కోట్లు మాత్రమే వచ్చాయి. దీనితో నిర్మాత భారీ నష్టాల్లో మునిగిపోయారు. దీనితో దర్శకుడు హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ ను వెనక్కు ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఆయన తన రెమ్యునరేషన్ లో దాదాపు 2 కోట్లను వెనక్కు ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు అన్నాయి.

ఇక ఇప్పుడు రవితేజా కూడా తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కు ఇచ్చారని అంటున్నాయి సినీ వర్గాలు. దాదాపు 4 కోట్లను రవితేజా వెనక్కు ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం మాత్రమే రావడంతో తన తర్వాతి సినిమా మీతో తక్కువకి చేస్తా అని నిర్మాత… విశ్వ ప్రసాద్ కు రవితేజా హామీ ఇచ్చారని కూడా సమాచారం. విశ్వ ప్రసాద్ ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేసారు. ఇక రవితేజాకు ఇటీవల షూటింగ్ లో గాయాలు కావడంతో సినిమా షూటింగ్ కు దూరంగా ఉన్నారు. రెండు నెలల పాటు ఆయన దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.