Sai Pallavi: కథ నచ్చితేనే సినిమా.. సాయిప‌ల్ల‌వి డిమాండ్ చేయకుండానే 10 కోట్లా..?

తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్‌లోను కొన్ని సినిమాలు చేస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి. ‘రామాయ‌ణం’ ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారీ భారీ సినిమా చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 10:35 AM IST

Sai Pallavi: సాయి పల్లవి ఓ సినిమా చేస్తుందంటే.. ఖచ్చితంగా విషయం ఉన్న సినిమానే.. అని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోతుంటారు. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండి.. కథ నచ్చితేనే సాయి పల్లవి సినిమా చేస్తుంది.. లేదంటే, ఎంత పెద్ద హీరో అయినా ఈజీగా రిజెక్ట్ చేస్తుంది. అందుకే.. విరాట పర్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది అమ్మడు. ఈ మధ్యలో ఏకంగా సాయి పల్లవి సినిమాలకు దూరమవుతుందనే ప్రచారం కూడా జరిగింది.

Manjummel Boys: తెలుగులోకి మంజుమ్మల్ బోయ్స్.. మనవాళ్లకు నచ్చిందా..?

కానీ.. ఇప్పుడు అంతకుమించి అనేలా సినిమాలు చేస్తోంది అమ్మడు. తెలుగులో నాగ చైతన్య సరసన ‘తండేల్’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. అలాగే తమిళ్‌లోను కొన్ని సినిమాలు చేస్తోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది సాయి పల్లవి. ‘రామాయ‌ణం’ ఆధారంగా దంగల్ దర్శకుడు నితేష్ తివారీ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. రావణుడిగా కెజియఫ్ హీరో యష్ నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక సీతగా సాయి పల్లవి ఫైనల్ అయింది. అయితే.. ఇప్పటి వరకు సాయి పల్లవి రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఎప్పుడు వార్తలు రాలేదు.

కానీ రామయణం కోసం భారీ పారితోషికం అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 10 కోట్లకు పైగానే తీసుకుంటుందట. అంటే.. ఇక్కడి కంటే ట్రిపుల్ రెమ్యునరేషన్ అందుకుంటుంద‌నే చెప్పాలి. అయితే.. ఇది సాయి పల్లవి డిమాండ్ చేసిన పారితోషికం కాదట. అమ్మడి క్రేజ్‌కి ఆ మాత్రం ఇస్తున్నారట బాలీవుడ్ మేకర్స్. ఏదేమైనా.. ఈ సినిమాతో సాయి పల్లవి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యారెంటీ.