Sai Pallavi: తగ్గేదే లే అంటున్న సాయిపల్లవి.. న్యాచురల్ బ్యూటీ నటనకు పాన్ ఇండియా ఫిదా..

సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దొచేసింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు ఆమె ముందు క్యూ కట్టిన హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒకే చేసింది. అలా సాయి పల్లవి నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 06:30 PM IST

ఆమె నటనకు తెలుగు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఇటీవల ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాల్లో సాయి పల్లవి నటన వేరేలెవల్. ఈ చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకుంది. అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. అటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యింది ఈ న్యాచురల్ బ్యూటీ. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై సాయిపల్లవి స్పందించలేదు.

చాలా కాలంగా నెట్టింట సైలెంట్ అయిన సాయి పల్లవి తాజాగా ముంబైలో సందడి చేసింది. ఆమె నటించిన రీసెంట్ హార్ట్ హిట్టింగ్ సినిమా గార్గి గతేడాది విడుదల మంచి హిట్ అందుకుంది. ఇందులో ఆమె నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు గానూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు గానూ.. ఉత్తమ నటిగా ఈ అవార్డ్ కైవసం చేసుకుంది. తాజాగా ఈ అవార్డ్ ప్రధానోత్సవాల కోసం ముంబై వెళ్లింది. అందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఈ అవార్డ్ వేడుకల కోసం సాయి పల్లవి రెడ్ సారీలో అక్కడకు హాజరైంది. చాలా కాలం తర్వాత న్యాచురల్ బ్యూటీ బయట కనిపించడంతో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు.