Samanta: నేరం నాది కాదు..చైతన్యదే..అతని వల్లే విడాకులు

డివోర్స్‌కు చైతునే కారణమని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది సమంత. విడాకుల లో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చింది .

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 06:00 PM IST

సమంత, నాగచైతన్య విడిపోయి ఏడాదిన్నర అవుతోంది. ఎందుకు విడిపోయారు? కారణం ఏమిటో వీళ్లకు తప్ప మరెవ్వరికీ తెలీదు. ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్‌ టాపిక్‌ వచ్చినా.. ఇద్దరం హ్యాపీగా వున్నాంకదా అని మాట దాటవేశాడు చైతు. అయితే.. సామ్‌ మాత్రం తేల్చేసింది. పాన్‌ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఇంటర్వ్యూలో ఐటంసాంగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొస్తూ.. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పకపోయినా.. తను కారణం కాదని చెప్పేసింది.

సమంత కెరీర్ స్టార్ట్‌ చేసి 14 ఏళ్లయినా.. పుష్ప ముందు వరకు ఒక్క ఐటంసాంగ్‌ కూడా చేయలేదు. చైతుతో విడిపోయాక పుష్ప లో ఐటంసాంగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగితే.. వైవాహిక జీవితంలో నేను నూటికి నూరుపాళ్లు నిజాయితీగా వున్నాను. ఏ తప్పూ చేయనప్పుడు బాధపడుతూ.. ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి? అనుకుని.. ఓకె చేప్పాను. అయితే… ఇంట్లో వాళ్లూ.. తెలిసిన వాళ్లూ …ఐటమ్ సాంగ్ చేయొద్దని చెప్పారు. నేను నేరం చేసినట్టు ఇంట్లో ఎందుకు కూర్చోలి?ఎవరిమాటా వినకుండా..ఐటంసాంగ్‌ చేసేశానని చెప్పుకొచ్చింది సామ్‌.

నాలుగేళ్ల పెళ్లి బంధం తర్వాత చైతు, సామ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టి సామరస్యంగా విడిపోయారు. ఎందుకు విడిపోయారో చెప్పలేదు. మీడియాలో రకరకాల కథనాలు వచ్చినా.. ముఖ్యంగా సామ్‌పై భారీగా ట్రోలింగ్‌ జరిగినా ఈఅమ్మడు పట్టించుకోలేదు. అయితే.. లేటెస్ట్‌ ఇంటర్వ్యూలో వివాహబంధంలో నేను నూటికి నూరుపాళ్లు నిజాయితీ వున్నానని చెప్పింది. అంటే.. తన తప్పు ఒక్క పర్సెంట్ కూడా లేదని తేల్చి చెప్పడంతో… డివోర్స్‌కు చైతునే కారణమని చెప్పినట్టేగా మరి.

ఇంతకాలం ట్రోలింగ్‌తో ఇబ్బందులు ఫేస్‌ చేసిన సమంతపై ట్రోలింగ్‌ తగ్గుతోంది. డివోర్స్‌ తర్వాత చైతు శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్‌ బైటకు రావడం… రీసెంట్‌గా లండన్‌లో డిన్నర్‌ డేట్‌కు వెళ్లి.. కెమెరా కంటిలో పడడంతో… ఎఫైర్‌ కన్ఫర్మ్‌ అయిపోయింది. దీనికి తోడు.. సామ్‌ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మ్యారేజ్‌ రిలేషన్‌లో 100 పర్సెంట్ నిజాయితీ వున్నానని చెప్పడం.. మరోవైపు చైతు, శోభిత దొరికపోవడంతో.. సామ్ మాటల్లో నిజముందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

తనకొచ్చిన మయోసైటిస్‌ గురించి మాట్లాడుతూ.. అరుదైన వ్యాధి కాకుండా తనపై తనకే కంట్రోల్‌ లేకుండా పోయిందని..కళ్లద్దాలు పెట్టుకుంది స్టైల్‌ కోసం కాదని.. తన కళ్లు వెలుతురు చూడనివ్వడం లేదని చెప్పుకొచ్చింది సామ్‌. తన ఇబ్బందులు ఏ నటికీ రాకూడదంటోంది సామ్‌. మొత్తానికి నేను నిజాయితీగా ఉన్నాను…చైతు దారి తప్పి తనను మోసం చేయడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఇండైరెక్టు గా చెప్పింది సామ్.