Samantha: అమెరికా ఫ్లైట్ ఎక్కేసిన సమంత.. యేడాది తరువాతే మళ్లీ స్క్రీన్ పైకి

సమంత సినిమాలకి కాస్త విరామం ప్రకటించారు. తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స నిమిత్తం న్యూయార్క్ కి ఫ్లైట్ ఎక్కి వెళ్లారు.

  • Written By:
  • Publish Date - August 20, 2023 / 10:05 AM IST

సమంత మున్ముందు ఖుషీ ప్రమోషన్‌లో కనిపించదు. ఇక ఖుషీ ప్రచారమంతా విజయ్‌ దేవరకొండ చేతుల మీదే సాగుతుంది. అదేంటి.. మ్యూజిక్‌ వెంట్‌లో కనిపించింది గా అనిపించవచ్చు. కాని ట్రీట్‌మెంట్ కోసం సమంత అమెరికా వెళ్తోందని.. అందుకే కొత్త సినిమాలు కూడా కమిట్‌ కాలేదన్న వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టే.. సామ్‌ అమెరికా ఫ్లైట్‌ ఎక్కేసింది. మూడు నెలలపాటు ట్రీట్‌మెంటే లోకంగా గడిపేస్తుంది.

రీసెంట్‌గా జరిగిన ఖుషీ మ్యూజిక్‌ కన్సర్ట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. భారీ ఓపెనింగ్స్‌ రావడానికి సమంత, విజయ్‌ డ్యాన్స్ ఉపయోగపడింది. మున్ముందు.. ప్రీ రిఈజ్‌ అవెంట్స్‌.. ఇంటర్వ్యూస్‌తో.. ఈ పాన్‌ ఇండియా మూవీకి మంచి హైప్‌ వస్తుందని సామ్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ ఆశపడ్డారు. ట్రీట్‌మెంట్‌కు ముందే డేట్‌ ఫిక్స్‌ అయిపోవడంతో.. సామ్‌ ఇక ప్రమోషన్‌కు రాదనే.. మ్యూజిక్‌ ఈవెంట్ పెట్టారట.
సామ్‌ ఒక్క ప్రమోషన్‌తో సినిమాకు కావాల్సినంత హైప్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా స్టేజ్‌పై సామ్‌, విజయ్‌ రొమాంటిక్‌ డ్యాన్స్‌పై విమర్శలు వచ్చినా.. అంతకంటే ఎక్కువగా.. సినిమాకు యూజ్‌ అయింది.

పాన్‌ ఇండియా మూవీ కావడంతో.. చెన్నై.. బెంగుళూరు.. ముంబాయ్‌ వెళ్లాల్సి వుంది. అక్కడ కూడా సమంత సందడి చేస్తే.. రేంజ్‌ మరింత పెరిగేది. సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టడం తప్పితే.. సామ్‌ ఇప్పట్లో కనిపించదు. మూడు నెలలపాటు న్యూయార్క్‌లో వుంటూ.. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటుంది. ఇప్పట్లో ఎంజాయ్‌మెంట్‌ వుండదని.. ఆ మధ్య బాలి వెళ్లి ఖుషీ అయి వచ్చింది. ఖుషీ మ్యూజిక్‌ ఈవెంట్‌లో ఎనర్జీతో కనిపించిన సామ్‌.. ట్రీట్‌మెంట్‌ తర్వాత మరింత బూస్టప్‌తో ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.