Sandeep Reddy Vanga: అజ్ఞానులు.. రివ్యూయర్లపై సందీప్ రెడ్డి వంగా పంచ్..

ఎందుకంటే వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఒక చిత్రాన్ని ఎలా విమర్శించాలి..? లేదా ఒక చిత్రాన్ని ఎలా రివ్యూ చేయాలి? అనేది కూడా వాళ్లకు తెలియదు.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 04:41 PM IST

Sandeep Reddy Vanga: సినీ విమర్శకులపై ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా గురించి సరైన అవగాహన లేకుండానే కొంతమంది రివ్యూలు రాస్తున్నారని ఆయన అన్నారు. తన చిత్రాన్ని విమర్శిస్తూ పలువురు డబ్బులు సంపాదిస్తున్నారంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు.

SALAAR: మంచి వాళ్లకు డార్లింగ్.. చెడ్డవాళ్లకు రెబల్ స్టార్

“నా చిత్రాన్ని విమర్శిస్తూ మీరు డబ్బు, ఫేమ్‌, పేరు పొందుతున్నారు. ‘కబీర్‌సింగ్‌’ విడుదలైనప్పుడు ఆ సినిమాపై చాలామంది విమర్శలు చేశారు. ఆ చిత్రాన్ని విమర్శించి ఫేమ్‌ పొందాలని భావించారు. ఆ సినిమా క్రాఫ్ట్‌, ఎడిటింగ్‌, సౌండ్‌ గురించి ఒక్కరూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఒక చిత్రాన్ని ఎలా విమర్శించాలి..? లేదా ఒక చిత్రాన్ని ఎలా రివ్యూ చేయాలి? అనేది కూడా వాళ్లకు తెలియదు” అన్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి తాను ముంబయిలో ఉంటున్నానని.. కొంతమంది ఫిల్మ్‌ మేకర్స్‌ డబ్బులు ఇచ్చి మరీ తమ సినిమాలపై రివ్యూలు రాయించుకుంటారని విమర్శించారు.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’. బాబీ డియోల్, అనిల్‌ కపూర్‌, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే, ఈసినిమాలోని పలు సన్నివేశాలను కొంతమంది సినీ విమర్శకులు తప్పుబట్టారు. స్త్రీని తక్కువ చేసి చూపించేలా సీన్స్‌ ఉన్నాయని దుయ్యబట్టారు. కాగా, వరల్డ్ వైడ్‌గా వెయ్యికోట్ల మార్క్‌కి దగ్గరగా యానిమల్ కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.