Shah Rukh Khan: జవాన్ మూవీ కోసం ఏడు కొండలెక్కిన షారుఖ్ ఖాన్..

షారుఖ్ ఖాన్ ముస్లిం.. నయనతార క్రిస్మియన్.. కాని ఈ ఇద్దరు వేరు వేరుగా ఫ్యామిలీస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కారణం మాత్రం ఈ వారమే విడుదల కానున్న జవాన్ మూవీ.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 06:01 PM IST

Shah Rukh Khan: తిరుపతిలో షారుఖ్ ఖాన్, నయనతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే జవాన్ మూవీటీం తిరుమలలో స్వామివారిని దర్శించుకుంఇ. ఇక్కడ విచిత్రం ఏంటంటే షారుఖ్ ఖాన్ ముస్లిం.. నయనతార క్రిస్మియన్.. కాని ఈ ఇద్దరు వేరు వేరుగా ఫ్యామిలీస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కారణం మాత్రం ఈ వారమే విడుదల కానున్న జవాన్ మూవీ. సౌత్ లో ఈ సినిమాకు ప్రమోషన్ పెంచాలంటే, ఇలాంటి ఫీట్లు తప్పవనే కామెంట్లు వస్తున్నాయి. నిజానికి షారుఖ్ ని ఎప్పుడూ చూడని ప్లేస్ లో జనాలు చూశారు. ఎన్నడూ రాని వెంకన్న సన్నిధికి షారుఖ్ వచ్చాడు. ఓ ముస్లిమై ఉండి తను ఇలా కూతురు, రిలేటివ్స్ తో రావటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఒక్క సారిగా సౌత్ లోని అన్ని రాష్ట్రాల్లో షారుఖ్ మీడియాలో వార్తగా నిలిచాడు. సో.. అనుకున్న టాస్క్ ని టీం మెంబర్స్ రీచ్ అయినట్టే. బీఫ్ తినే అలవాటున్న బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, బ్రహ్మాస్త్ర టైంలో వారణాసి వెళ్లాడు. పూజలు చేశాడు.

సౌత్ లో టెంపుల్స్ చుట్టు ప్రదక్శిణలు చేశాడు. ఇప్పుడు హిట్ కోసం షారుక్ కూడా ఏడుకొండలెక్కాడు. సో.. సౌత్ మార్కెట్ కోసమే కాదు, హిట్ కోసం కూడా దేవుడి దయ కావాల్సి వచ్చింది. సల్మాన్ గణపతి నవరాత్రులు తన ఇంట్లోనే జరుపుతాడు. తను ముస్లిమైనా ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. ఆమీర్ ఖాన్ మాజీ వైఫ్ హిందూనే కాబట్టి తను టెంపుల్స్ కి దూరంగా ఎన్నడూ లేడు. కాకపోతే షారుఖ్ వైఫ్ గౌరీ హిందువే అయినప్పటికీ, షారుఖ్ హిందూ టెంపుల్స్ లో సందడి చేసింది లేదు. అందుకే తను సడన్ గా తిరుపతిలో కనిపించే సరికి, జవాన్ హిట్ కోసం ఎన్ని పాట్లు పడుతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.