Bigg Boss Season 7 : జ్యోతిషుడిగా అమర్.. ఆడేసుకున్న శివాజీ, అర్జున్

బిగ్ బాస్ 7 కు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ క్లైమాక్స్ కు చేరుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. పైగా నామినేషన్ల గోల లేకపోవడంతో కూల్ గా సాగుతోంది. చివరి దశకు చేరుతుండటంతో విన్నర్ ఎవరో అన్న యాంగ్జైటీకి మరి కొన్ని రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది

బిగ్ బాస్ 7 కు త్వరలో ఎండ్ కార్డ్ పడనుంది. సీజన్ క్లైమాక్స్ కు చేరుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. పైగా నామినేషన్ల గోల లేకపోవడంతో కూల్ గా సాగుతోంది. చివరి దశకు చేరుతుండటంతో విన్నర్ ఎవరో అన్న యాంగ్జైటీకి మరి కొన్ని రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది. మొన్నటి వరకు జర్నీ వీడియోలతో బుల్లితెర వ్యూవర్స్ ను ఎమోషనల్ చేసిన బిగ్ బాస్.. లాస్ట్ ఎపిసోడ్‌ని ఫన్నీఎపిసోడ్ గా మార్చేశాడు. ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో మొదలైన ఎపిసోడ్ డే అంతా సరదాగా మారిపోయింది. అంతేకాక బిగ్ బాస్ హౌస్ జ్యోతిషాలయంగా మారిపోయింది.

బిగ్ బాస్ అమర్ ను జ్యోతిషుడిగా మార్చేశాడు. అంతేకాక ఇంట్లో ఉన్న హౌస్ మెంట్స్ కి తనదైన స్ఠైల్ లో జాతకం చెప్పాలని సూచించాడు. దీంతో అమర్ జ్యోతిషుడిగా మారిపోయి జాతకాలు చెప్పాడు. ప్రశాంత్ తో మొదలు పెట్టి.. కప్పు దగ్గరలో ఉందని కానీదాని మరో ఐదుగురు పోటీ పడుతున్నారని చెబుతూ నవ్వులు పూయించాడు. ఇక యావర్ వంతు వచ్చింది. అంతా బాగానే ఉందని.. కప్పు కొట్టాలంటే ఏడు గ్రహాలు అడ్డు తగులుతున్నాయన్నాడు. నీవల్ల బయటకు వెళ్లిన వాళ్లు అడ్డుకుంటున్నారని సరదా నవ్వించాడు. ప్రియాంక ఫైర్ బ్రాండ్ అంటూ జాతకం చెప్పాడు. ఇక శివాజీ, అర్జున్ అమర్ ను ఆడేసుకున్నారు.

ఇక శివాజీ జాతకం చెబుతూ.. తనకు ఇష్టమైన వారిలో యావర్, అమర్ దీప్ ఉన్నారన్నారు. కానీ యావర్ కే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పాడు. ఇక ఫైనల్ గా అర్జున్ జాతకం చెప్పేందుకు ప్రయత్నించాడు అమర్ దీప్. కానీ అర్జున్ అమర్ కే షాక్ ఇచ్చాడు. తన జాతకం చెప్పించుకోవడం కాకుండా అమర్ దీప్ జాతకాన్ని చెబుతూ వచ్చాడు. అనగనగా ఓ కారు.. నాకు ఆ కారే గుర్తుకొస్తుందంటూ.. ఓ స్టోరీ చెప్పుకొచ్చారు. దీంతో అమర్ వద్దండి బాబోయ్ అంటూ వేడుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య సీన్ ఆసక్తికరంగా మారింది. శివాజీ కూడా అమర్ దీప్ జాతాన్ని చెప్పడం ప్రారంభించారు. అమర్ దూకుడుతనంతో వెళ్తున్నాడని చెప్పాడు. ఇక ఈ గేమ్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి ఫుడ్ ను గెలుచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. యావర్ కు ఇంటి నుంచి ఫుడ్ రాగా.. అందరి తో పంచుకుంటానని చెప్పడంతో.. యావర్ కు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. యావర్ కు వచ్చిన ఫుడ్ ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత ఓ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో అర్జున్ గెలుపొందారు. గెలుపొందిన వారు తమ ఫుడ్ ను మరోకరి అందించాల్సి ఉంటుంది. దీంతో తన ఫుడ్ ను పల్లవి ప్రశాంత్ కు ఇచ్చారు. ఇందు ప్రశాంత్ థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి ఎపిసోడ్ సరదా సరదాగా సాగిపోయింది