Mahesh SSMB 29 : ఎస్ ఎస్ ఎంబీ 29లో సీతూ పాప.. తండ్రీ, కూతుళ్లు ఒకే ఫ్రేమ్‌లో..

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) -టాలీవుడ్ (Tollywood) జక్కన్న రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ఎస్ ఎస్ ఎంబీ 29 (SSMB29).. మ‌హేష్ తొలి పాన్ ఇండియా చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా.. కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) -టాలీవుడ్ (Tollywood) జక్కన్న రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ఎస్ ఎస్ ఎంబీ 29 (SSMB29).. మ‌హేష్ తొలి పాన్ ఇండియా చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా.. కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ రూపొందుతున్న ఈ మూవీపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ మూవీలో మహేష్ బాబు ముద్దుల కూతురు సీతూ పాప కూడా నటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది.

ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన మహేశ్‌ ఇటీవ‌లే జర్మనీలో అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ పూర్తి చేసాడు. త్వర‌లోనే సినిమాకి సంబంధించిన వ‌ర్క్ షాప్స్ మొదలు పెట్టడానికి జక్కన్న కూడా రెడీ అవుతున్నాడు. వ‌ర్క్ షాప్స్ లో మ‌హేష్ తో పాటు సితార కూడా పాల్గొంటుంద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది. దీంతో.. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రీ-కుమార్తెల్ని ఒకే ఫ్రేమ్ లో చూపించ‌డానికి అంతా సెట్‌ చేస్తున్నాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఈ సినిమాలో సితార నటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది. నరనరానా నటన వారసత్వాన్ని జీర్ణించుకున్న సీతూ పాప ఫస్ట్ మూవీ ఎంట్రీకి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ ఏముంటుందంటున్నారు అభిమానులు..

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సందడి చేస్తూ వస్తున్న సీతూ పాపను వెండి తెరపై చూడాలని అభిమానులు కూడా చాలా ఆశ పడుతున్నారు. మహేష్ బాబు ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.ఒక వేళ రాజమౌళి కనుక తన తదుపరి సినిమా లో సీతూ పాపను చూపించాలని భావిస్తే మాత్రం తప్పకుండా మహేష్‌ బాబు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి కంటే గొప్ప దర్శకుడు మహేష్‌ బాబుకు సితార ఎంట్రీకి దొరికే ఛాన్స్ లేదు. కనుక మహేష్‌ బాబు కచ్చితంగా రాజమౌళి కి సీతూ పాపను అప్పగించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా చెప్పారు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. ఇలాంటి ప్రెస్టీజియస్‌ మూవీతో సితార ఎంట్రీ ఇస్తే.. తన ఫ్యూచర్ తారా జువ్వలా దూసుకుపోవడం ఖాయమంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.