పెళ్ళైన రెండు నెలలకే ఇల్లు అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవల ముంబైలోని తన ఇంటిని అమ్మాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 10:22 AM IST

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇటీవల ముంబైలోని తన ఇంటిని అమ్మాలని నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది. పెళ్లి అయిన రెండు నెలలకే ఆమె ఇంటిని అమ్మాలనుకోవడం వెనుక కారణం ఏంటీ అనే దానిపై బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. బాంద్రా వెస్ట్ లో ఉన్న ఆమె ఇంటికి పెద్ద సెంటిమెంట్ ఏ ఉంది. అయినా సరే ఆమె అమ్మాలనుకుంది. ఆమె ఈ ఏడాది జూన్ 23న నటుడు, రియల్ ఎస్టేట్ డెవలపర్ జహీర్ ఇక్బాల్‌ను, ఆ ఇంట్లోనే వివాహం చేసుకుంది. 4200 చదరపు అడుగుల ఫ్లాట్ అది.

దీనితో ఇప్పుడు దీనిపై మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. దాని వెనుక పెద్ద కారణమే ఉందని జాతీయ మీడియా వెల్లడించింది. ఇదే అపార్ట్మెంట్ లో మరో ఫ్లాట్ ని ఆమె కొనుక్కుని ఉండవచ్చు అని ముందు అందరూ భావించారు. కాని ఆమె భర్త జహీర్ తమ కోసం మరో ఇంటిని నిర్మిస్తున్నారట. అందుకే సోనాక్షి ఆ నిర్ణయం తీసుకుందని జాతీయ మీడియా పేర్కొంది. పెళ్లి తర్వాత ప్రస్తుతం ఉండే ఇల్లు సరిపోయే అవకాశం లేదని అందుకే ఆ ఇంటిని ఆమె అమ్ముతున్నారట. ఆమె తండ్రి శత్రుగ్న సిన్హా… పాట్నా నుంచి ముంబైలో అడుగు పెట్టిన తర్వాత కొన్న మొదటి ఇల్లు.

అలాంటి ఇంటిని ఆమె అమ్మడం కుటుంబానికి ఇష్టం లేదు. అయినా సరే 25 కోట్లకు అమ్ముతుంది సోనాక్షి. బాంద్రా వెస్ట్ లో ఉన్న ఈ ఫ్లాట్ ను విక్రయించే బాధ్యతను ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించింది సోనాక్షి. రియల్ ఎస్టేట్ సంస్థ “ది ప్రాపర్టీ స్టోర్” సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాన్ని సోనాక్షి లైక్ చేసింది. అది అలా ఉంచితే… జహీర్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ అపార్ట్మెంట్ లు నిర్మిస్తూ ఉంటారట. ఇక సోనాక్షి తో వివాహం తర్వాత ఉండేందుకు ముందు నుంచే ఒక ఇంటిని నిర్మిస్తున్నారని, ఆ ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తయింది అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆ ఇంటికి సోనాక్షి మారుతోంది.